Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Tuesday, September 10, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే - 3


గురువుల జ్ఞాపకాలను సీరియల్‌గా రాయలని అనుకోలేదు. అయినా యాదృశ్చికంగా గుర్తుకొచ్చేవి ఇలా  రికార్డు చేస్తున్నానంతే.  ఇందులో ఒక  గురువు మరియు వినాయక చవితి వుండటం విశేషం 

కొంతకాలం మధ్యప్రదేశ్‌లో పనిచేసివచ్చాక 1985లో  ఇంటివద్దే వుండిపోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు ఒక మిత్రునిద్వారా ఒకవిషయంతెలిసింది. అదేమంటే ఎక్కడైనా వర్కుషాపులో  పనిచేసినట్టు సర్టిఫికేట్టు వుంటే ఐ.టి.ఐ. పరీక్ష రాయవొచ్చని. అందుకోసం జేవియర్స్ ఐ.టి.ఐ. వర్కు షాపులో బీరువాలు తయారీలో నానీ అనే ఒకాయ వుండేవారు ఆయన దగ్గర పనికి చేరాను. నాతోపాటు మరో ఇద్దరు ఆయన చేతిక్రింద పనిచేసేవారు. అప్పటివరకు ఆఫీసు పనులు చేసిన నేను ఆ పని కష్టమనిపించేది. బీరువా కోసం షీట్ ను  ముందుగా తగిన కొలతలతో చుక్కలు పెట్టుకొని వాటి ప్రకారం వులితో కట్ చెయ్యడం, అవసరమైన వంపులు కొన్ని మిషను సహాయంతో మరికొన్ని సుత్తిని వుపయోగిస్తూ చాకచక్యంగా వంచడం కత్తిమీద సాములా అనిపించేది. మొదటి వారంలో సుత్తెదెబ్బవేయడంలో మెళకువలు తెలియక  వేళ్ళు నలగ్గొట్టుకున్న సందర్భాలు వున్నాయి. షీట్‌ను డిజైన్ చెయ్యడం అనేది అన్నిటిలో కీలకమైన పని. దాన్ని సులువుగా నేర్చుకున్నానని ఆయన నా స్నేహితులతో అనడం తటస్థించింది. డ్రిల్లింగు, రివిటింగు, షీట్‌లో చొట్టలను కనిపెట్టి సరిచెయ్యడం, విదివిడిగా బెండింగు చేసుకున్న వాటిని ఒక్కచోట చేర్చి రివిటింగు చేసి, తలుపులు అమర్చడం, తలుపులకు, లోపలి అరలకు తాళాలు తయారు చేసుకుని బిగించడం. చివరిగా కొలతలను చూసుకొని   టింకరింగు   ఛేయించడం.  

తర్వాతి సంగతి పెయింటరు చూసుకునేవాడు. చలా కాలం పెయింటింగు సెక్షనుకు నేను వెళ్ళలేదు. ఒకరోజు వెళితో అంతకుముందు రోజు మేము పూర్తిచేసిన బీరువాకు గ్రీన్‌మెటాలిక్ రంగు వేస్తున్నారు. వావ్... మేమేనా చేసింది ఈ బీరువాను అనిపించింది.
 
నేను రాయలనున్న ఐ.టి.ఐ. పరీష కాస్థ అప్పటికే 25 దాటిన వయస్సువల్ల అవకాశం పోయింది. దానితో అక్కడ పనిచేయడంలో ఉత్సాహం ఎక్కువరోజులు మిగలలేదు.

ఈ సోదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ సంవత్సరం నానీ మేస్త్రీ (ఆయన్ని అలానే పిలిచేవారు, ఆయన అసలుపేరు తెలియదు) వినకచవితి పూజను మొత్తం నాచేత చేయించారు. అంతకుముందే కొన్ని సందర్భాలలో నేను పంచె, లాల్చీ ధరించేవాణ్ణి. అది తెలిసిన ఆయన నా చేత పంచె కట్టించి, తను కూడా పంచె కట్టుకుని పూజా విధానం పుస్తకం తెప్పించి ఆరోజు పూజను నాచేత చేయించారు. పూజ తర్వాత లేవబోతుంటే వాళ్ళ ఆవిడ ప్రక్కన ఇళ్ళలోని వారిని పిలిచి కూర్చోబెట్టి కథను చదవమన్నారు. పంచే కూర్చుంటానికి అనుకూలమైనా, ఆ వయసులో అంతసేపు కూర్చోవడం గొప్ప విషయమే.  ఎలాగో కథ పూర్తి చేసాను. నేను అంతకుముందు తెలియని కొందరు ఆడవాళ్ళు కుర్రపంతులు గారు కథ బాగా చదువుతున్నారు, మాయింటిలోనూ కథ చెప్పించుకుంటాము వస్తాడంటారా! ఎంత తీసుకుంటారు అని అడగటం నా చెవిన పడనే పడింది. :) 
 
అప్పటికి గురువు (నానీ మేస్త్రీ) ఏదో తాంబూల ఇచ్చారు అది గుర్తు లేదు కానీ, చాలా కాలం తర్వాత చవితి నాటి కథను బాగ వినిపించావయ్యా! అని మెచ్చుకోవడం గుర్తుంది.
 
అప్పుడు పూజను మనస్సుపూర్తిగా చేసానో, పైపైనే చేసానో గానీ, వినాయకచవితి పూజలో కూర్చోవడం అదే తొలి మరియు తుది. 

తర్వాతి కాలంలో హైదరాబాదు వచ్చేయడంతో  మళ్ళీ ఆయన్ను కలవలేదు. కలవాలనే ప్రయత్నంచేసినప్పుడు ఆయన ఇక లేరు అనే విషయం తెలిసింది.  

 

Sunday, September 8, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే - 2

1975-77 లో నేను చదివిన జూనియర్ కాలేజి, ఏలూరు నా స్నేహితుడు/నాజూనియర్ 
Chunduri Srinivasa Gupta   
ఇన్ని సంవత్సరాలైనా మారని గేటు ఓ తియ్యని జ్ఞాపకం

ఇంటర్మీడియెట్  కోసం గర్నమెంటు జూనియర్ కాలేజి, ఏలూరులో 1975-77 బాచ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు మాకు శ్రీ జనార్దన రావు,  ప్రిన్సిపాల్‌గా వుండేవారు. కొంచెం పొట్టిగాను, పరమ కఠినంగానూ ఉండేవారు. ఆయనకు ఇంగ్లీషు పొయెట్రీ అంటే పరమ పిచ్చి. అందుకే అన్నీ గ్రూపులను (ఎం.పి.సి., బై.పిసి., సి.యిసి., ఎం.ఇ.సి., హెచ్.ఇ.సి.) ఒక్కచోట ఆరుబయట మైదానంలో కూర్చోబెట్టి, మైకు పెట్టి పొయెట్రీ పాటాలు చెప్పేవారు. ఈయన నాన్నకు స్నేహితులు అవ్వడంవల్లనే ఇక్కడ నన్ను చేర్పించారని రెండు సంవత్సరాలు పూర్తయ్యాక తెలిసింది. మా కాలేజి ప్రక్కనే రెవెన్యూ ఆఫీసుల సమూహం ( తాలూకాఫీసు, ట్రజరీ, తాలూకా కోర్టు ఇంకా కొన్ని.) వుండేవి.  ఇద్దరు ఎప్పుడైనా కల్సే సందర్భం ఏర్పడినప్పుడు ఇంగ్లీషు సాహిత్యం గురించే మాట్లాడుకునేవారంట. 

నాకు తెలియకుండానే నన్ను కవిత్వంవైపు నడిపించారని ఇన్నేళ్ళ తర్వాత ఇలా గుర్తుచేసుకోవడంలో బయటపడింది.
ఆయన చెప్పిన పాఠాల్లో నాకు గుర్తున్నవి మూడు
1. బ్రూక్ -
THE BROOK
by: Alfred Tennyson (1809-1892)
COME from haunts of coot and hern,
I make a sudden sally,
And sparkle out among the fern,
To bicker down a valley.
 
By thirty hills I hurry down,
Or slip between the ridges,
By twenty thorps, a little town,
And half a hundred bridges.
 
Till last by Philip's farm I flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on forever.
 
I chatter over stony ways,
In little sharps and trebles,
I bubble into eddying bays,
I babble on the pebbles.
 
With many a curve my banks I fret
by many a field and fallow,
And many a fairy foreland set
With willow-weed and mallow.
 
I chatter, chatter, as I flow
To join the brimming river,
For men may comeand men may go,
But I go on forever.
 
I wind about, and in and out,
with here a blossom sailing,
And here and there a lusty trout,
And here and there a grayling,
 
And here and there a foamy flake
Upon me, as I travel
With many a silver water-break
Above the golden gravel,
 
And draw them all along, and flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on forever.
 
I steal by lawns and grassy plots,
I slide by hazel covers;
I move the sweet forget-me-nots
That grow for happy lovers.
 
I slip, I slide, I gloom, I glance,
Among my skimming swallows;
I make the netted sunbeam dance
Against my sandy shallows.
 
I murmur under moon and stars
In brambly wildernesses;
I linger by my shingly bars;
I loiter round my cresses;
 
And out again I curve and flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on forever
ఈ పాఠం గుర్తు రాగానే గోదావరి నది మాత్రమే గుర్తుకొస్తుంది. ఈ పాఠం విన్నరోజుల్లోనే కోస్తా /కోనసీమ ఏరియాలో ఒకపెళ్ళికి వెళ్ళాడం, ఒక గ్రామంనుండి అమలాపురంవరకు కొంతమంది పడవలో వెళ్ళాము.  ఆనుభవమే గుర్తుకొస్తుంది. తర్వాతి రోజుల్లో గోదావరి, మరికొన్ని నదుల పుట్టుక ప్రదేశాలను సందర్శించినప్పుడు నాకు ఈ బ్రూక్ పాఠం, జనార్దన్ రావు గారు చెబుతున్న స్వరం వినబడుతుంది.


2. సోలిటరీ రీపర్ -
The Solitary Reaper -William Wordsworth

Behold her, single in the field,
Yon solitary Highland Lass!
Reaping and singing by herself;
Stop here, or gently pass!
Alone she cuts and binds the grain,
And sings a melancholy strain;
O listen! for the Vale profound
Is overflowing with the sound.

No Nightingale did ever chaunt
More welcome notes to weary bands
Of travellers in some shady haunt,
Among Arabian sands:
A voice so thrilling ne'er was heard
In spring-time from the Cuckoo-bird,
Breaking the silence of the seas
Among the farthest Hebrides.

Will no one tell me what she sings?--
Perhaps the plaintive numbers flow
For old, unhappy, far-off things,
And battles long ago:
Or is it some more humble lay,
Familiar matter of to-day?
Some natural sorrow, loss, or pain,
That has been, and may be again?

Whate'er the theme, the Maiden sang
As if her song could have no ending;
I saw her singing at her work,
And o'er the sickle bending;--
I listened, motionless and still;
And, as I mounted up the hill,
The music in my heart I bore,
Long after it was heard no more.


 ఈ పాఠం చెబుతున్నప్పుడు ప్రకృతిని గురించి, పని పాటలు సంస్కృతిలో భాగం. జానపథాన్ని వివరిస్తూ, బహుశ ఆమె "ఎన్నియెల్లో, ఎన్నియ్యాల్లో హుయ్ ..."   అని పాడిందేమోనని అప్పటికి కొద్దిరోజులముందే విడుదలయ్యిన భక్తకన్నప్ప సినిమాలోని పాట :
సాహిత్యం: ఆరుద్ర , గానం: రామకృష్ణ, పి.సుశీల

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)

అరె సిన్నోడా ..
ఆకుచాటున పిందె ఉందీ .. చెట్టూ సాటున సిన్నాదుందీ
ఓ ఓ ఓ ఆకుచాటున పిందె ఉంది .. చెట్టూ సాటున సిన్నాదుందీ
సక్కని సుక్కని టక్కున ఎతికీ దక్కించుకోరా .. దక్కించుకోరా

దక్కించుకోరా .. దక్కించుకోరా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అరె సిన్నమ్మీ ..
మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఓ ఓ ఓ మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా

మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
అరెరెరెరె ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా

ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా
ఓ ఓ ఓ సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా

కొప్పూ లోనీ మొగలీ పువ్వూ గుప్పుమందే .. ఒప్పులకుప్పా
ఓయ్ గుప్పుమందే .. ఒప్పులకుప్పా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని
ఓ ఓ ఓ సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని

దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా నీకు నేనే .. నాకు నువ్వే
నీకు నేనే .. నాకు నువ్వే !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)
...............................................................పాటను డాన్సు చేస్తూ మరీ చెప్పారు.
పాఠంలోని పదాలు, పాదాలు అలాగే గుర్తులేదుగాని ఆయన చెప్పిన తీరు మాత్రం బాగా గుర్తుండిపోయింది.

3. అ సీన్ ఫ్రం   జూలియెస్ సీజర్
అంథోనీ స్పీచ్‌లోని ద్వైదీభావాన్ని,  దానిలోని హావ భావాలను నటించి, అభినయించిన వివరించిన తీరు ఇంకా కళ్ళముందు మెదులుతూనేవుంది   నారికేళ పాకమని చెప్పబడే షేక్‌స్పియర్‌ను   చదవడం సులువనిపించింది.  అప్పుడు చదవలేకపోయినా  గానీ తర్వాతి కాలంలో చదవడానికి గురువుగారు ఉపకరించారు అని చెప్పాలి.

*** గురువుగారు జనార్దన రావు గారు ఎక్కడవున్నా వారికి శిరసువంచి నమస్కరిస్తున్నాను.

Friday, September 6, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే


గతంలో నా బాల్య విద్యాభ్యాసాల గురువుల్ని జ్ఞాపకంచేసుకున్నాను. తరచూ మారుతున్న ఊర్లవల్లనో లేక నా జ్ఞాపకశక్తి లోపమో గాని లేక నా అనాసక్తో తెలియదు గాని చాలామంది పేర్లు గుర్తులేవు.

9వ తరగతినుంచి ఇంటర్మీడియెట్ వరకు  మా నాన్నగారంటే భయపడి తప్పించుకునేవాణ్ణి. ఆయన పనిచేసేది రెవెన్యూ డిపార్టుమెంటు అయినా మేము చదువుకునే సమయానికి ఆయనకు సమయం కుదిరితే షేక్సిపియర్ గురించో, బెర్నడ్ షా గురించో చెబుతుండేవారు. అలాంటి సమయంలో నేను లెక్కల పుస్తకాల్లోకి దూరేవాణ్ణి. ఆయనకు లెక్కలంటే భయం అదీ సంగతి.   అయితే ఇప్పుడర్థమవ్వుతుంది నాకు పరోక్షంగా కవిత్వంపై మక్కువ నాన్న కల్పించారని.

గురువులను తలచుకున్నప్పుడు 9, 10వతరగతులలో ప్రభావితంచేసిన ముగ్గుర్ని ముఖ్యంగా గుర్తు  చేసుకోవాలి.
శ్రీ సైమన్ - తెలుగు
శ్రీ ఆండ్రూస్ - ఇంగ్లీషు
శ్రీ జార్జి - లెక్కలు ... మాష్టార్లు. (జేవియర్స్ హైస్కూలు, ఏలూరు) వారు నేర్పినవే నాల్గక్షరాలు నాల్కలపై ఇంకా నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
అదేమి చిత్రమోగాని 10వ తరగతిలో  తెలుగుమాష్టారు ఎప్పుడూ కోపంగావుండేవారు.  పాఠాలుకూడా చాలా సీరియెస్‌గా   చెప్పడంవల్ల తెలుగంటే భయపట్టుకుంది. ఆ భయం కాస్తా ఇంటర్మీడియేట్‌లో హిందీ చదివేటట్టుచేసింది. హిందీ చెప్పిన మేడం పేరు  గుర్తులేకపోవడమే నాకు ఎప్పటికీ అర్థంకాని విషయం.  కానీ ఇన్నేళ్ళతర్వాత కూడా ఆమె చెప్పిన హిందీ సాహిత్యం గుర్తుకొస్తుంది. అలా పరోక్షంగా ఇప్పటి నా సాహిత్యాభిరుచికి ఆమె పునాదివేసింది అనిపిస్తుందిప్పుడు.

ఆమె పేరు శ్రీమతి వరలక్ష్మి (అప్పటికి ఇంకా శ్రీమతి కాలేదని గుర్తు) అని ఇప్పుడే ఆన్‌లైన్లోకివచ్చిన మిత్రుడు చెప్పాడు.
దోహేలు గుర్తుచేసుకున్నప్పుడు  ఇప్పుడే  తరగతి గదిలో  వున్నట్టే అనిపిస్తుంది నాకు.
నవల ఒకటి నాండిటేల్ వుండేది  నవలపేరు గుర్తులేదు కాని నవలలోని ముఖ్యఘట్టాలు ఇంకా గుర్తున్నాయి. 
హిందీ క్లాసుకు కొసమెరుపు ఏమిటంటే వరలక్ష్మి గారు అందంగా వుండటమే కాకుండా మధురంగా పాఠం చెప్పడం, అన్ని గ్రూపులలో వున్న విద్యార్ధిని , విద్యార్థులు ఒక్కచోటకు చేరటం. అంతే కాక మగపిల్లకంటే, అమ్మయిలే ఎక్కువగా వుండటంవల్ల క్లాసు అందంగాను, రంగురంగులగాను వుండటంవల్ల ఒక్క క్లాసుకూడా మిస్సు కాలేదని గుర్తు.  
తర్వాత కాలంలో డిగ్రీలో పెద్దగా ప్రభావితంచేసినవాళ్ళు లేకపోవడంవల్ల ఎవ్వరూ గుర్తు  లేరు.
* * *

కవిత్వాన్ని ఆశ్రయంగా పొందాక మొదటి గురువు శ్రీ సి.వి. కృష్ణారావు  గారు.

మొదట పరిచయం అయినప్పుడు "నెలనెలా వెన్నెలకు" వస్తూవస్తూ ఓ రెండు కవితలు పట్టుకు రావడం మరిచిపోకండి అని పోనుచేసి చెప్పేవారు. నెలంతా రెండు కవితలు రాయాలి అనే అలోచన మనసులో కదులుతూ వుండటంవల్ల కొన్ని సార్లు నెలంతటిలో ఒక్కటీ రాయలేకపోవడం, ఒక్కోసారి ఒకటికంటే ఎక్కువ రాయడం  అనుభవం.  బహుశ ఈయన ప్రభావంవలననే కవిత్వం నిత్యకృత్యమైయ్యింది.  
ఆయన నన్ను అడిగే రెండు ప్రశ్నలు ఎప్పుడూ స్ఫూర్తిగానేవుంటాయి.  కొత్తవేమిరాసారు అని మొదటిది. కొత్త పుస్తకాలు ఎమి సంపాదించారు అని రెండవది.
ఆయనతో గడిపిన సమయమంతా ప్రపంచ సాహిత్యాన్ని చుట్టివచ్చినట్టే వుండెది. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్పిస్తుంది


***


కవిత్వాన్ని రాయడం ప్రారంభించాక కొందరి కవిత్వం నన్ను ఆకర్షించింది. వారిని గురువులుగానే స్వీకరిస్తాను
శివారెడ్డి - ఈయన కవిత్వాన్ని  చదివినప్పుడు, ఆయనతో సమయం గడిపినప్పుడు ఏమనిపించిందో గమనించలేదు గానీ గుండె ఆపరేషను అయ్యి పడకమీదవున్నప్పుడు ఆయన కవిత్వాన్ని వల్లెవేయడం నాకు నాకే ఆశ్చర్యమనిపించిన విషయం.

జ్వాలాముఖి - అనర్గళమైన ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు దాని వెనుకవున్న ఆయన కృషి, సాధన కన్పించాయి. ఆయనలా అనర్గళంగా మాట్లాడంటే చేయాల్సిన కృషి ఎప్పుడూ గుర్తుకువచ్చేది.



కె. శివారెడ్డి, కె.యెస్. రమణ, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి, నాళేశ్వరం శంకరం,   వాడ్రేవు చినవీరభద్రుడు,    వీరి కవిత్వం చదివినప్పుడు నేనూ వీరిలా రాయగలగాలి అని స్ఫూర్తినిచ్చారు. వీరి కవిత్వాన్ని స్పూర్తిపొంది రాసిన కవితా సందర్భాలున్నాయి.

***

ఈ మధ్య ఎం.ఎ. తెలుగు దూరవిద్యలో చదవడం మొదలుపెట్టాను
అక్కడ బయట పరిచయముండీ  . శ్రీ కె.యస్. రమణ,   శ్రీ సుధామ, ప్రత్యక్ష గురువులైనవారు
శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీ తిరునగరి శ్రీనివాస్, శ్రీమతి రజని, శ్రీ పాల్ రత్నాకర్ గార్లు కొత్తగా గురువులయ్యారు.

ఇక్కడ సహ విద్యార్దులుకూడా  శ్రీమతి అరుణ, శ్రీమతి పద్మ, శ్రీమతి ఉష ఉపాద్యాయులుండటం గమనార్హం.


గురువులను గుర్తు చేసుకోవడం కొత్త వుత్తేజాన్ని ఇచ్చింది.
***

అక్క శ్రీమతి మేరీ సలోమి ఉపాద్యాయినిగా వుండటం అభినందనీయం





Wednesday, April 24, 2013

అతికి పోతే.....


నేను 8వ తరగతి చదువుతున్న రోజుల్లో ఎలా ఏర్పడిందో గాని మిరపకాయబజ్జీలంటే భలే ఇష్టం ఏర్పడింది. సాయంకాలంపూట ఒక(పాక/గుడిశె) హోటలులో సాయంకాలాలు మిర్చిబజ్జీలు వెయ్యడం మొదలుపెట్టారు. అక్కడే చిన్న ఆ వూరిబస్సులు ఆగేవి. అప్పటికి ఇంకా బస్సు షల్టరు ప్రత్యేకంగా ఏదీ లేదు ఆవూరిలో. సినిమాహాలుకు వెళ్ళే దారికూడా కావటంవల్ల బాగానే అమ్ముడుపోయేవి. 

ఒక్కో మిర్చి బజ్జీ 3 పైసలు, 
10 పైసలకు నాలుగు ఇచ్చేవారు. మిర్చిలోపల ఏ రకం మషాలా పెట్టేవారో సరిగ్గ గుర్తులేదు కానీ వామ్ము తప్పకుండా వుండేది.
చేతిలో పది పైసలు వుంటే నలుగు స్నేహితులం కలిసి బజ్జీలు తినేవాళ్ళం.


ఒకరోజు స్నేహితుల మధ్య ఎవరు ఎక్కువ తినగలరు అని ఒక వాదన పుట్టింది. ఇక బెట్టింగు మొదలయ్యింది. అప్పటికే నాకు బాగా ఇష్టమని నాకూ, నా స్నేహితులకు తెలుసు. చేతిలో డబ్బులు పోగుచేసుకొని ఓ రోజు   ఒక పట్టుపట్టాము. స్నేహితులు రెండు, మూడు కన్నా ఎక్కువ తినలేకపోయారు. నేను మాత్రం 11 బజ్జీలను సునయాసంగా తినేసాను. వాంతి కాని అవుతుందేమోనని కొద్దిసేపు వేచి చూసాము. ఏమీ కాలేదు. పందెం గెలిచి ఇంతికివెళ్ళి పడుకున్నాను. 

తెల్లవారి నిద్ర లేచే సరికి   వళ్ళంతా దద్దుర్లు. చలా కంగారు అయ్యింది. అమ్మకు తెలిస్తే తిడుతుందని కనబడకుండా చూసుకొని ఇంటినుంచు బయటపడ్డాను. స్కూలుకు వెలుతూ స్కూలు ప్రక్కనే వున్న గవర్నమెంటు ఆసుపత్రిలో డాక్టరు దగ్గరకు వెళ్ళాను. అప్పుడు తెలిసింది ఆ దద్దుర్లు రాత్రి తిన్న బజ్జీలలోని మిర్చివల్ల వచ్చిందని. ట్యాబ్లెట్టులు తీసుకుని స్కూలుకు వెళ్ళిపోయాను. ఆసుపత్రిలొ పనిచేసే ఒకాయన నన్నుచూడటంవల్ల  విషయం అమ్మకు తెలిసిపోయింది.

సాయత్రం స్కూలునుంచి రాగానే తెలియకుండా బయట తిన్నందుకూ, పందెం కోసం తిన్నందుకూ, దద్దుర్లు దాచిపెట్టి ఆసుపత్రికి వెళ్ళినందుకు దద్దుర్లు సరిపోవని వాతలు వచ్చేటట్లు నాలుగు వుతికింది.

దద్దుర్ల కన్నా వాతలే బాగా బాధించిన దానికన్నా అమ్మకు కోపంతెప్పించానే అనేబాధ ఎక్కువనిపించింది.


ఇంతకీ నేను ఎందుకు గుర్తొచ్చిందీ ఇది అంటే "అతికి పోతే ఏదొక దద్దుర్లు, తర్వాత వాతలు తేలతాయని"


**15725

Thursday, August 30, 2012

జమున - సత్యభామ - తాజ్ మహల్


జమున - సత్యభామ - తాజ్ మహల్

* * *

ఈ రోజు మార్నింగ్ వాక్ చేస్తూ ఎఫ్.ఎం వినడం జరిగింది, అందులో విన్న విషయం ఈ రోజు జమున పుట్తిన రోజని.
కొన్ని జ్ఞాపకాలు వెంటాడాయి. ప్రొద్దున్నే నాల్గు మాటలు రాదామనుకున్నా, కాని విద్యుత్తు కోత తర్వాతి పనులతో అది కాస్తా ఇప్పటికి కుదిరింది.

తెలుగు సినీ జగత్తును ప్రేక్షకులను అందంతో, అభినయంతో కట్టి పడేసిన సత్యభామ.

1979లో ఒక సారి ఏలూరునుండి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లొ హైదరాబాదు వెళుతున్నాను. అప్పట్లో రాత్రి ప్రయాణానికి గోదావరి ఒక్కటే ట్రైన్. బస్సులు కూడాలేవప్పుడు. నాకు క్రింది బర్త్ రిజర్వేషన్ దొరికింది. విజయవాడ వచ్చేసరికి స్ట్రేషనులో ఒకటే హడావిడి. జమున వచ్చిందని ఈ ట్రైన్ ఎక్కుతుందని. నేనూ చూద్దామని ఫ్లాట్ ఫారం అంతా వెదికాను కాని కనబడలేదు. ఉస్సూరు మంటూ నా సీటులో కూలబడ్డాను. అప్పుడు ఓకరెవరో వచ్చి కొంచెం పై బర్తుకు సదురుకుంటారా అని అడిగారు. వెంటనే కాదని చెప్పాను. తర్వాత కొద్దిసేపటికే తెలిసింది ఆ బర్త్ జమునకోసం అడిగారని. తెలిసినవెంటనే ఎగిరి గంతేసి ఒప్పుకుని... పలకరించి, ఆటోగ్రాఫ కోసం ఏదైనా వెదికాను బ్యగులో ఏమి దొరకలేదు. వెంటనే తెలుపు గళ్ళ కొత్త లుంఘి వుందని గుర్తుకు వచ్చి దానిపై ఆటోగ్రాఫ్ తీసుకున్నా. చాలా రోజులు దాన్ని వాడలేదు.
ఎంతమందికి అపురూపంగా చూపించానో.
తర్వాత ఎప్పుడు ఎలా వాడానో గుర్తులేదు మళ్ళీ ఇప్పుడు గుర్తుకు వచ్చింది.

***
1990, 1992 రండు సార్లు ఆగ్రా వెళ్ళాను. తాజ మహల్‌ను చూసివచ్చాను.



1999, 2000లలో "మూడ్స్ ఇన్ లవ్" కొన్ని ఫొటోలకు తెలుగు క్యాప్‌షన్స్ రాసాను. జియోసిటీలో పెట్టాను  కానీ ఇప్పుడు ఆ సైటు లేదు. అవి రాస్తున్న సమయంలో సత్యభామను గురించి చదివాను. మళ్ళీ సత్యభామనగానే జమున గుర్తుకు వచ్చేది.

తాజ్‌మహల్‌లోని విశిష్టత సమయాలను బట్టి వేర్వేరు రంగుల్లో కనబడుతుంది. నాట్యంలోవున్న అష్టవిధ నాయికలు తమ తమ అభివ్యక్తిని చూపించడానికి నేర్పే భంగిమల్లాగా తాజ్‌మహల్ అనిపించింది. అలాంటి లక్షణాలను ఎక్కువ సత్యభామలోనే కన్పించాయి. మళ్ళి అక్కడా జమునే ప్రత్యక్షం.


* * *


జ్ఞాపకాలను ప్రోది చేసుకుంటూ శుభాకాంక్షలు. అధుత నమస్కారాలు, అద్భుత అభినయానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.


Friday, March 23, 2012

అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయిందా!!!!!

గత ఉగాదికి బైపాస్ ఆపరేషన్ అయ్యి డిశ్చార్జ్ కోసం ఎదురు చూస్తున్నాను. డాక్టర్లు, నర్సులు ఉగాది పచ్చడి తినిపించారు. అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయిందా అనిపిస్తుంది కాని, ఎన్ని అవాంతరాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిద్ర పట్టని రాత్రులు. అన్ని షడ్రుచుల సమ్మేళనమే.జ్ఞాపకాలను విప్పి చుపలేను కానీ, దేహం పై ఆపరేషన్ కుట్ల గాయాల కనిపిస్తూనే ఉన్నాయి.
జీవితమెప్పుడూ ఒకేలా ఉండదుకదా

గతంలో బ్లాగులో  సరదాగా నా చేతిని స్కాన్ చేసి హస్త సాముద్రకాన్ని గురించి ఎవరైనా చెబుతారా అని అడిగినప్పుడు ఓ అజ్ఞాత మిత్రుడు మీ ఆరోగ్యం జాగ్రత్త. త్వరలో ఏమైనా జరగోచ్చు అని చెప్పాడు. అప్పుడు సరదాగానే తేలికగా తీసుకున్నా. ఇప్పుడది చూసినప్పుడు ఆశ్చర్య మనిపిస్తుంది.

నాకు సేవ చేసిన పిల్లలు, నా ప్రక్కటెముక మరువ లేని వారే.

అన్ని వేళల్లోనూ స్పూర్తి నిచ్చి త్వరగా కోలుకోవడానికి ధైర్య పరిచిన మిత్రులను మరచిపోలేను. 
 


Wednesday, February 29, 2012

లీపు సంవత్సరపు కోయిల ముందే కూసింది



యవ్వనంలో లీపు సంవత్సరపు తేదీపై చాలా గొప్ప అంచనాలు వుండేవి. ఎందుకంటే  ఆరోజు వివాహం చేసుకోవాలని ప్రత్యేకంగా వుంటుందని అనుకొనేవాణ్ణి. నాకు 24, 25 సంవత్సరాలు వచ్చాక ఎవరైనా పెళ్ళి ఎప్పుడూ అని అడిగితే 29.2.1988 అని టక్కున చెప్పేవాణ్ణి.

అన్నీ నేను అనుకున్నట్టే జరిగితే ఈ రోజు పోస్టు మరోలా రాసేవాడిని. 

"తొందరిపడి ఒక కోకిల ముందే కూసింది" అన్న చందంగా కొన్ని అనివార్య కారణాలవల్ల అనుకున్న తేదీకంటే ముందుగానే పెళ్ళి చేసుకున్నాను.  లీపు సంవత్సరపు తేదీ నాకు ప్రత్యేకత లేకుండా పోయింది. 

వెనక్కు తిరిగి చూసుకొని బాధ పడలేదు, ఎందుకంటే తొదరపడి కూయటంలో మాట నిలుపుకుని నా ప్రక్కటెముకను పొందగలిగాననే తృప్తి చేజారిన ప్రత్యేక తేదీ దిగిలును మరిపించేస్తుంది.

Wednesday, December 14, 2011

జ్వాలాముఖిని తలచుకోవడమంటే నా జ్ఞాపకాలను తాజా పరచుకోవడమే



జ్వాలాముఖిని తలచుకోవడమంటే నా జ్ఞాపకాలను తాజా పరచుకోవడమే.
అవి నేను అప్పుడప్పుడే కలంపట్టిన రోజులు. తెలుగుయూనివర్సిటీ ఎన్.టి.ఆర్. అడిటోరియంలో కవిసమ్మేళనం జరుగుతుంది.
వేదిక అధ్యక్షులుగా శ్రీమతి  నాయని కృష్ణకుమారి, శ్రీ ఉత్పల సత్యనారయణ, శ్రీ కె. శివారెడ్డి, ఎస్.వి. సత్యనారాయణ, శ్రీ జ్వాలాముఖి ఇంకొందరు వేదికమీదున్నారు. చాలామంది ప్రముఖ కవులు, కవయత్రులు కవితలు చదివారు. నాకు చివరలో అవకాశం దొరికింది. అప్పటికే కవిత్వం చదినవారు ఏవేవో సాకులతో వెళ్ళిపోవడంతో సభ పల్చబడింది, ముగింపుకొచ్చేసరికి నా కవిత్వానికి ఎవరు స్పందించలేదే అనే దిగులు నన్ను కమ్మింది. వరండాలోకి వచ్చాక అటుగా వస్తున్న ఆయన దగ్గరకు పిలిచి భుజంమీద చెయ్యివేసి పోయం బాగుంది. కొత్తగా రాస్తున్నట్టులేదు రాస్తూవుండు అని భుజం తట్టారు. ఆయనే శ్రీ జ్వాలాముఖి. అదే మొదటి పరిచయం. ఆ సంతోషాన్ని వివరించడానికి మాటలు లేవు నాదగ్గర.

నా కవిత్వంని ఆస్వాదించి నన్ను పరిచయం చేసుకున్నవారు బహు కొద్దిమంది అందులో ఈయన ప్రధముడు. తర్వాత చాలా సార్లు చాలా సభలలో కలిసాము. ఆయనలో నాకు ఒక అంశం నచ్చింది. అది ఏమిటంటే అనర్గళంగా మాట్లాడగలగడం. నేను చర్చిల్లో మాట్లాడే అవకాశలను ఇంత అనర్గళంగా మాట్లాడగలనా అని ఓ రోజు ప్రశ్నించుకున్నా. ఆ టెక్నిక్‌ను పట్టుకోవడానికి ఆయన సభలకు తప్పకుండా వెళ్ళే వాణ్ణి.
అయన  కవిత్వంనుండి, వ్యాసాలనుండి, ఆయన జ్ఞాన సంపదనుండి ఏమీ పొదానో తెలియదు గాని, అర్గళంగా మాట్లాడం వెనుక వున్న కృషి, సాధన గమనించాను.  చాలా కష్టమైన ప్రక్రియే అయినా సాధన చేసాను.
నేనెప్పుడన్నా ప్రసంగిచాల్సి వచ్చినప్పుడు జ్వాలముఖిని గొంతు ద్వారం దగ్గర వుంచుకుంటాను.

కవిత్వం ఏమిచ్చింది అనే ప్రశ్న తరచూ వినబడుతుంటుంది. నేను చెప్పగలను అనర్గళతవైపు నన్ను నేను మలచుకోవడానికి ఒక సాధనం(టూల్) దొరికిందని.
శ్రీ జ్వాలముఖిని తలచుకొనే ఈ రోజు చంద్రునికో నూలుపోగులా నా జ్ఞాపకం ఇలా మీ ముందు పరిచాను. ఆయన జీవన, జీవిత స్థితిగతులు ఎలా వున్నా  ఒక సూచికగా నాకు నిలిచిన ఆయన మూర్తిమత్వానికి శిరసువంచి నమస్కరిస్తున్నాను. 
ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ఓదార్పు కలగాలని సదా ప్రార్థిస్తాను.  

Monday, November 14, 2011

ఫేసుబుక్కు ఆరు నెలల ప్రయాణం – సింహావలోకనం


ఏప్రిల్, మే, జూన్ నెలలలో మెడికల్ శెలవులో వున్నప్పుడు  మే నెలలో ఇంటిలో నెట్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అంతర్జాలము నాకేమి కొత్త కాదు. నేను బ్లాగు మొదలు పెట్టిన తొలినాళ్ళలో సుమారు 200 బ్లాగర్లు మాత్రమే వుండేవారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ బ్లాగులు రాసిన రోజులవి. అప్పట్లో మదర్స్ డే సందర్భంగా  రాసిన పోస్టులతో అమ్మ అనే ఈ సంకలనం చేయడం జరిగింది. తెలుగులో వచ్చిన మొదటి ఈ సంకలనము. రెండవ ఈ పుస్తకము,
అంతర్జాల పోస్టులతో నాన్న  సంకలనం చేయాలని ఎప్పటిదో కొందరిమిత్రుల కోరిక.  ఫాదర్స్ డే రోజునుంచి కొంతమంది స్పందించారు. వారిలింకులనుండి పోస్టులను సేకరించాను. పేజి సెట్టింగులు చేసి కొంత పనిచేసాను కంప్యూటరులో వైరస్ రావడం, బ్యాకప్ తీసుకొనే అవకాశం చిక్కకుండా ఫార్మేట్ అవ్వడంతో ఆ కోరిక సగంలోనే అసంపూర్ణంగా మిగిలిపోయింది. శరీరం అనుకూలిస్తే అది పూర్తి చెయ్యాలి. ఇంతకుముందు స్పందించిన మిత్రులు ఇది చదువుతున్నట్లయితే మీ లింకులు పంపండి ప్రయత్నాన్ని కొనసాగిస్తాను.   
సేకరించిన డాటా కోల్పోవడం చాలా బాదాకరం అనిపించింది.
అప్పుడే శ్రీమతి శైలజామిత్ర ఫేస్ బుక్కును పరిచయంచేసారు. ప్రతీరోజు గాయాలకు డ్రెస్సింగు అయ్యాక భోజన సమయంలోపు గ్రూపులోనివి  చదవడం అలవాటయ్యింది.. వివిధ మిత్రులద్వారా కొన్ని గ్రూపులు పరిచయమయ్యాయి. నిద్ర పట్టని రాత్రులను ఫేసుబుక్కు కవిత్వంలో గడిపాను.

సాహిత్య మిత్రులు, సాహిత్యనిధి, స్వేచ్చ, తెలుగు సాహితీ వలయం, మొజాయిక్, ప్రేమ ప్రేమకై.. ప్రేమించు, నానోలు ...ఇలా గ్రూపులు పరిచయమయ్యాయి. 
శైలజా మిత్ర సాహితినిధి, సాహితిమిత్రులు గ్రూపును పరిచయం చేసారు
జ్యోతిర్మయి తెలుగు సాహితీవలయం గ్రూపును పరిచయంచేసారు
ఈగ హనుమాన్ నానోలు గ్రూపును పరిచయంచేసారు
మురళీధర్ నామాల స్వేచ్చ గ్రూపును పరిచయం చేసారు
జగతి జద్దాత్రి మొజాయిక్ గ్రూపును పరిచయంచేసారు
శ్రీనివాస్ వాసుదేవ్ ప్రేమ ...ఒరేమకై ప్రేమించు... గ్రూపును పరిచయం చేసారు
 

ఇంతకుమునుపే సాహిత్యంలో పరిచయమున్నవారు ఫేసుబుక్కులో కొద్దిమంది మాత్రమే వున్నా నేను వున్న శారీరక పరిస్థితిని బట్టి ఆన్ని చదివినా నచ్చినవాటిని మాత్రమే అభిప్రాయాలు రాయటం మొదలుపెట్టాను.
వాదులాటలు, కీచులాటలు అభిప్రాయభేదాలు ఏ గ్రూపుల్లో కూడా తలెత్తినప్పుడు వాటినుండి దూరంగానే వున్నాను. 
కొందరికి నేను చేసిన సూచనలు నచ్చాయి, నచ్చినవారు అమలుచేయడం కనిపించింది. కొందరు వారిదోరణిలో(మొనాటనీ) వారు వెళుతున్నట్టే కన్పించారు. అటువంటివారి పోస్టులు పెద్దగా పట్టించుకోవడం మానేసాను.
ఆసుపత్రి అనుభవాలను అక్షరీకరిద్దామనే బలీయమైన కోరిక వుండేది, మొదలుపెట్టి కొన్ని పోస్టులు రాసాను. అవి చూసి వీడేంటి ఇలా రాస్తున్నాడు అనుకున్నవారు వుండేవుంటారు. రెండు మూడు నెలల తర్వాత ఆ పోస్తులను అన్నీ ఒకచోట పెడదాము అనుకుని ప్రయత్నం చేసా కానీ ఫేసు బుక్కులో రాసిన పోస్టులు శాశ్వతంగా (బాక్ అప్) ఉండవని అప్పుడే తెలిసింది.    వాటిని కోల్పోయాను. మళ్ళీ అలాగే రాయలేను.
 ఒకొక్కరిగా పరిచయాలవుతున్న నేపద్యంలో కొందరి మాటలు స్వాంతనను, కొత్త స్పూర్తిని నింపితే కొందరి మాటలు, పనితీరులు కొంత నొప్పించాయి. అప్పుడే గ్రూపులో ఏమి జరుగుతుంది అని చూడటం కంటే నాకు ఏది అవసరం అనే విషయంపైనే శ్రద్ద పెట్టాలి అని నిర్ణయించుకున్నాను.
పరిచయాలలో :
మురళీధర్ నామాల
బ్లాగులలో పరిచయం. తూర్పు పడమరల సమయ తేడాలవల్ల నిత్యం ఆన్‌లైనులో తోచినదేదో మాట్లాడినవాడు.
స్వేచ్చగ్రూపుకు మార్గం చూపాడు. ఇంచుమించు నా అన్ని రాతలను చదివిన వాడు.  
ఈగ హనుమాన్ ఫేసుబుక్కులో కంటే ముందుగానే తెలిసిన సాహితీమిత్రుడు. చాలా సందర్భాలలో కలిసిన, తరచూ ఫోనులో మాట్లాడుకొనే సాన్నిహిత్యం.  నానోలలోని   రసాస్వాదనను  నాకు ఎక్కించాడు. 

ఫేసుబుక్కులో కంటే ముందుగానే తెలిసిన సాహితీమిత్రుడు. తరచూ ఫోనులో మాట్లాడుకొనే సాన్నిహిత్యం.  

జగతి జగద్దాత్రి - ఫేసు బుక్కుకంటే ముందుగానే తెలిసినా, ఫేసు బుక్కు సాహితీ సాన్నిహిత్యాన్ని పెంచింది. చాట్ చేస్తూ చేస్తూ మాట్లాడిన పదాలలోంచి పాటలుగా అల్లడం జరిగింది. ఆ ధోరణి(ఫీవర్) కొన్నిరోజులు సాగి సుమారు 12 పాటలు రాయడం జరిగింది. నా బ్లాగులో చూడవచ్చు. విశాఖకు వస్తే మొజాయిక్ ఆహ్వానం అనడంతో అక్టోబరు నెలలో (10.10.2011)  మండే మొజాయిక్‌ లో పాల్గొనడం జరిగింది. దాని వివరాలు బ్లాగులో చదవొచ్చు. 
నూతక్కి రాఘవేంద్ర రావు :
ఈయన మూడుచక్రాల బండి అనే కిరీటంతో రాసినవి నన్ను ఆకట్టుకోవడమే కాకుండా, మరింత సన్నిహితం చేసాయి. పెద్దవయసులోకూడా ఆయన  కవిత్వాన్ని  గురించి చూపించే ఆసక్తి  నన్ను అబ్బుర పరుస్తూనేవుంది. నన్ను ఉత్తేజపరుస్తూనేవుంది.
బహుముఖ ప్రజ్ఞలు ఈమె కలిగి వుండటం ఆశ్చర్యపరచిన సందర్భంలో నన్ను గజల్ రాయమని సూచించడం జరిగింది. నేను మొజాయిక్‌లో పాల్గొన్నప్పుడు నేను రాసిన పాటను పాడివినిపించి మరింత ఆశ్చర్యానికి లోను చేసారు. కొన్ని గజల్స్ ప్రయత్నించడం  జరిగింది.

జగన్నాద్ వడిమెల్ల
కవికిరీటి మీకు నేను ఏకలవ్య శిష్యుడను అంటూ ఉక్కిరిబిక్కిరిచేసే సోదరుడయ్యారు.

తను రాసిన వీరి వీరి గుమ్మడిపండులో నన్నూ చేర్చడంద్వారా చేరువయ్యి నేను విశాఖ వెళ్ళినప్పుడు నా కవిత్వం గురించి సభలో పరిచయంచేసారు.

రసవత్తరంగా రాసే కవిత్వంతో పాటు అంతే రసవత్తరంగా ఆయన అభిప్రాయలు వెలిబుచ్చడం నన్ను సన్మోహనపరచాయి. గ్రూపులో బైబిలు వాక్యాలను పోస్టు చేయమని   ఉదయమే చదవడం చాలా బాగుంటుదని అని  బాధ్యతనిచ్చారు.
శ్యామిలి నయబిల్లి
పోస్టు చేయగానే లైకు పెట్టదానికి ముందువుంటుంది. ఎప్పుడు ఆన్‌లైనులోనే కనిపిస్తుంది. ఎప్పుడు నిద్రపోతుందా అనేది నా అనుమానం
తమదైన గొంతులతో కవిత్వాన్ని వ్యక్తీకరిస్తూ నాకెందుకో వీరి కవిత్వాన్ని చదవాలనే ఆసక్తిని కలిగించారు
కల్లూరి శైలబాల
తక్కువ పరిచయం ఎక్కువ ఇంపాక్ట్ /అనుభవం
ఓరోజు మీ కవితా నేపద్యం రాయండి అని ఒక పోస్టువేసారామె. దానికి స్పందిస్తూ నేను కొన్ని పోస్టులు రాసాను. రెండుమూడు పోస్టుల మినహా మిగతావి అమె చూసినట్టు నాకు అనిపించలేదు. ఎవరికి వారు అక్షరాల వెనుక, అక్షరాల మధ్య చదువుకునేది  కవిత్వం. నేపద్యం పాఠకుడికి చెప్పడంవల్ల అక్షరాల ముందు వెనుక, మధ్య అనే పరిధికి  పరిమితులు గీసినట్టు అవుతుంది. అదే విషయం మిత్రులు చెప్పారు, ఇది కోరినది శైలబాల  అయినా నన్ను నేను పునః పరిశీలించుకోవడానికి దోహదపడుతుందని రాసాను.
అవి ఒక డాక్యుమెంటుగా పొందు పరచాను. మరోసారి పోస్టుచేస్తాను.
కొన్నిరోజులతర్వాత మళ్ళి గ్రూపులో కనబడి ఎదో అడిగారు ఆమె. ఇలా అడుగుతారు మళ్ళీ కనబడరు అనేసరికి కోపమొచ్చినట్టువుంది. ఆ పోస్టును డిలీట్ చేసారు మళ్ళీ నాకు గ్రూపుల్లో తారస పడలేదు.
* * *

మూడునెలల శెలవుల తర్వాత ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించాను. ఆఫీసు అవసరాల దృష్ట్యా ఎప్పుడూ ఆన్‌లైను ఉండటం వల్ల ఫేసుబుక్కులోకి తొంగిచూసే అవకాశం చిక్కింది. 
మెల్ల మెల్లగా పనిభారం  పెరుగుతూ  వచ్చింది. అలా రావటంవల్ల చదివిన వాటికి అభిప్రాయాలు రాసే సమయం తగ్గిపోయింది.
సెప్టెంబరు 5న చాలారోజుల తర్వాత వురకలేసిన నా కలం - అనే కవిత రాసాను. అది చాలారోజుల తర్వాత రాసిన కవిత అది. దాని తర్వాత రాయటం తరుముకొచ్చింది.
------------------
ఈ మద్యలోనే చేసిన ఇతర పనులు
ఎప్పుడో రాసిన ప్రేమాంతరంగం - కావ్యాన్ని బ్లాగులో పోస్టుచేసాను.
తెలుగు ఇంగ్లీసులలో వచనం వంబడి వచనంగా  బైబిలులోని అధ్యాయాలు తెలుగు బైబిలు  బ్లాగులో పోస్టుచేసాను.
--------------
ఎక్కువసమయం ఆ ఫేసుబుక్కులోనే గడుపుతున్నావు అని నా ప్రక్కటెముక హెచ్చరిస్తుంది
అందుకే కొన్నిరోజులు అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తాను.

నా అభిప్రాయాలు రాస్తే బాగుంటుందని ఎదురుచూసి ఎవరైనా నిరుత్సాహం చెందితే మన్నించండి.


సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు  పీతవి

Tuesday, September 20, 2011

గోదారి అనుబందం -2

 
పడవనెక్కిన బాల్యం
ఓడనెక్కినట్టు సంబరం
తెడ్డును పరీకించిన కనులు
జీవితాన్ని చిత్రించిన రీళ్ళు
***
వాలుకు తెరచాపైనా
ఎదురుకు గడసాయమైనా
పడవెనక పారిపోతున్న అలలు
జీవితాన్నిపయనించడం నేర్పిన పనిముట్లు
* * *
ఎలా మరువగలను
వెన్నెల జలకమాడించి
పరుగులు నేర్పిన ఆ ఇసుకతెన్నలను
పచ్చదనాల నా బాల్యాన్ని
 * * * *
( ఫోటో : కొండవీటి సత్యవతి  )

Saturday, September 17, 2011

గోదారి అనుబందం

బాల్యంలో ఈ పచ్చదనాన్ని
నాకెవరో నలుగు పెట్టారు
ఇప్పుడది
గుండెల్లోకి ఇంకింది

**

బాల్యానెవరో చెక్కారు
ఆ బడిలోనో ప్రక్కనున్న గూడిలోనో
ఇప్పుడది
జ్ఞానపు కొమ్మల్లో వూగుతుంది

****
 

ఈతలు నేర్పారెవరో
ఈ నీళ్ళలోనే
ఇప్పుడు
నగరాన్ని ఈదగలుగుతున్నా

**


(అంతర్వేదికి, గోదారికి, కొండవీటి సత్యవతి గారికి, సుజాత గారికి)

Monday, December 13, 2010

జ్వాలముఖి - నేను - కొన్ని జ్ఞాపకాలు


సమయం త్వరిత గతిన పరుగెడుతుందని కొన్నిసార్లు అనిపిస్తుంది. కొంత స్పూర్తిని పొందిన నేను నిన్ననో, మొన్ననో ఆయనని కలిసాను అనిపిస్తుంది. ఆయన ప్రసంగించే తీరు, అనర్గళత  ఆయనకు సాహిత్యంపై వున్న పట్టును చెప్పకనే చెబుతుంది.   

2003 సంవత్సరం  కవిత్వాన్ని రాస్తూ, తారసపడ్డవారికి వినిపిస్తూ కవిత్వ లోతుపాతుల్ని తెలుకుంటున్న సమయం. హైదరాబాదు తెలుగు యూనివర్సిటీ, ఆడిటోరియంలో ఉగాది కవిసమ్మేళనం జరిగింది. అందులో పాల్గొనాలని, నా కవిత చదవాలనే ఉత్సాహంతో  అందరికంటే ముందుగా చేరాను. ఆ కార్యక్రమానికి నాయని కృష్ణ కుమారి గారు అధ్యక్షత వహించారు, ఉత్పల సత్యనరాయణ గారు ప్రత్యేక అథిదిగా వేదికనలంకరించారు.

వేదికనలంకరించిన వారిలో జ్వాలాముఖి ఒకరు.    అవకాశం కల్పించాలని సభ నిర్వహిస్తున్నవారిని ముందుగానే పలుమార్లు కోరినప్పటికి ప్రముఖు   సభ ఆలస్యంగా ప్రారంభమై, ఎవరికి వారు పనివుందంటూ తమకవిత్వాన్ని చదివి వెళ్ళిపోతున్నారు.  జ్వాలాముఖి ముందస్తు ఎన్నికలపై కవిత చదివారు. చివరిగా కృష్ణకుమారి గారి విశ్లేషణ  పూర్తయ్యింది. ఎంతకీ అవకాశం రాకపోయేసరికి కొంచెం అసహనాన్ని సభికులమద్య  ప్రదర్శించే సరికి, ఎవరో కొద్దిగా చొరవతీసుకొని ముగ్గురికి సమయాన్ని ఇచ్చే ఏర్పాటు చేసారు. మొదటిసారి ఇలాంటి అవకాశం రావటం. భయం భయంగా, బెరుకు బెరుకుగానే "వసంతమా ఎప్పుడొచ్చావు నీవు" అనే కవిత చదివాను. ఎవరు ఎలా స్పందించారో కూడా తెలియలేదు. బయటకి వస్తున్నప్పుడు దగ్గరకు పిలిచి కొత్తగా రాస్తున్నట్లే లేదు. రాస్తూవుందు. బాగుంది కవిత అని భుజంపై చెయ్యివేసి మరీ అభినందించారు జ్వాలాముఖి. ఆ అభినందన నాకు చాలా స్పూర్తి నిచ్చింది.

తరువాత 2004లో విజయవాడలో, ఎక్స్ రే వారి ఆద్వర్యంలో 24 గంటల కవిసమ్మేళనం జరిగింది. అందులో నేను పాల్గొన్నాను. అప్పుడు కొంతమంది సీనియర్ కవులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కలిగింది. అందులో జ్వాలాముఖి ఒకరు.  కార్యక్రమం చివరలో నాకు ఇచ్చిన జ్ఞాపిక అనుకోకుండా ఆయన చేతులమీదుగానే తీసుకోవడం జరిగింది. అప్పుడే నేను రాసిన "హసీనా" దీర్ఘ కవితకు పరిచయ వాక్యాలు రాయమని వారిని కోరను. కొన్ని నెలలు గడిచినా ఆయన ఎందుకో రాయలేదు. చివరికి ఆయన మాటలు లేకుండానే ఆ పుస్తకం బయటకు వచ్చింది. ఆయనతో నాలుగు మాటలు రాయించుకోవడం కోసమైనా కొంత రాయాలనిపించేది. ఆ కోరిక తీరకుండానే మిగిలిపోయింది.  

ఆ తర్వాత చాలా సభల్లో కలిసినప్పుడు చాలా ఆత్మీయంగా పలకరించేవారు నన్ను. ఆయన ప్రసంగించే తీరు నన్ను ప్రతిసారీ అబ్బురపరచేది.    క్రైస్తవ సమావేశాలలో నాకు మాట్లాడే అవకాశం కలిగినప్పుడు   ఆయన శైలి అనుకరించే ప్రయత్నం చేసాను. ఆ శైలి నన్ను ఇప్పటికీ ఉత్తేజపరుస్తూనే వుంటుంది.

నెలనెలా వెన్నెల (హైదరబాదు)లో ఆయన మగ్దూం గురించి పంచుకున్న విషయాలు సాహిత్యంపై నన్ను మరింత ఆశక్తిని కలిగే టట్లు చేసింది.

ఒకరోజు హైదరాబాదు సెంట్రల్ లైబ్రరీలో ఎవరిదో పుస్తకావిష్కరణ జరుగుతుంది. నేను కూర్చున్న వెనుకనే ఆయన కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత సాహిత్యప్రస్థానం  చేతికిచ్చి చూసావా అని అడిగారు. ఎందుకు అలా అన్నారా అని అనుకుంటూనే పేజీలు తిరగేస్తుంటే అయనే .. కవిత బాగుంది అన్నారు. ఆ సంచికలో నా కవిత వుండటమే కాకుండా ఆయన వ్యాసం తర్వాత వుండటం విశేషం. ఇప్పటికీ నమ్మలేనిదే అనిపిస్తుంది.

(డిశెంబరు 14న ఆయన వర్థంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు   )

Friday, May 28, 2010

బాల్యం జ్ఞాపకాలతో ఓ రోజు

అనుకోకుండా ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా మావూరుకు వెళ్ళడం జరిగింది. నిజానికి 16.5.2010 ఆదివారము ఒక వివాహ కార్యక్రమానికి అథిదిగా పిలవబడ్డాను.  శనివారము రాత్రి బయలుదేరటం ఆలస్యము, నగర ట్రాఫిక్‌తో గాంధీ బస్సుస్టేషనునుంచి నేను అందుకోవాలనుకున్న బస్సు వెళ్ళిపోయింది.దీకి వెళితే సుమారు 6-7 గంటలమద్య అశ్వారావుపేట చేరుకుంటే అక్కడనుండి ఎవరైనా నన్ను పెళ్ళి జరిగే చోటికి తీసుకొని వెళతారని ప్రణాలిక. బస్సు దాటిపోవడంతో నా ప్రయా అంచలంచలుగా మారింది. ఖమ్మం వరకు ఒక బస్సు, ఖమ్మంనుంచి సత్తుపల్లి వరకు ఒక బస్సు, సత్తుపల్లినుంచి అశ్వారావుపేట వర్కు ఇంకో బస్సు మారి 8.30 గంటలకు చేరాను. అక్కడనుండి మోటరు బైక్‌పై ఓ గ్రామానికి ప్రయాణం. ఓ ఐదు కిలోమీటర్ల  వర్కు రోడ్డు బాగానే వున్నా ఆలస్యమయ్యిందని అనుకున్నా.వివాహ కార్యక్రమము త్వరగా ముగించుకొని ఆ సాయత్రం జంగారెడ్డిగూడెంనుండి పోలవరం వెళ్ళాను.

ఉదయమే కెమేరా చేతపట్టుకొని కొన్ని ప్రదేశాలు చూసుకుంటూ పాండురంగడి కొండకు వెళ్ళాను. కొద్ది దూరం ఎక్కేసరికి  వయసు సహరించనని మారం చేసింది. అందుకే సగం నుంచే వచ్చేసాను.
నేను బాలయంలో చదివిన మూడు పాఠశాలలను కెమేరాలో బంధిద్దామని చిన్న అలోచన కలిగింది. నేను 3, 5వ తరగతులు చదివిన ఎలిమెంటరీ పాఠశాల పూర్తి రూపాన్ని మార్చుకుంది.

అప్పుడు పెంకులతో వుండేది ఇప్పుడు కొత్త భవనము, కొత్త పథకాల పేరు.  



7వ తరగతి చదివిన అప్పర్‌ప్రైమరీ పాఠశాల తన స్థానాన్ని మార్చుకుంది. పాత భవనాల నామరూపలే లెవక్కడ. గోదావరి వరదల్లో కొట్టుకపోయిందో లేక మరేదైనా పరిస్థితులో అక్కడ ఇప్పుడు సగం అరటితోట వెలసింది.

పాఠశాలకు వెళ్ళే మలుపులో ఓ పెద్ద బావి వుండేది. బ్రాహ్మల బావి అనేవారు అక్కడ ఇప్పుడు బావి తాలూకు ఆనవాళ్ళే లేవు.(వూరులోని చాలా బావులు లేవు, బావులగురించి తర్వాత వీలుబట్టి మరో టపా రాస్తాను)
8వ తరగతి చదివిన జూనియర్ కాలేజీ ప్రాంగణానికి వెళ్ళాను. ఆ పాఠశాల 1912లో స్థాపించబడినట్లు గుర్తు.
పాత భవనాలు చాలావరకు లేవు. ప్రస్తుతం శెలవలు కావడంతో అన్నీ తాళాలు దర్శనమిచ్చాయి.
నేను 8వ తరగతి చదివిన భవనం అలానేవుంది. మా తరగతి ఎదురుగావుండే బావి మాత్రం లేదు. ఆబావి దగ్గర ఎన్నో జ్ఞాపకాలు. ఇంటర్వెల్ సమయంలో అమ్మాయిలకు చేదిపోసిన నీళ్ళు, చలోక్తులు జ్ఞాపకాల్లోకి జారిపోయినట్టే బావికూడా ఒక జ్ఞాపకంగా మిగిలింది.

సుమారు ఎనిమిదింటికి ఇంటికి చేరిన, మళ్ళీ ఊరిలోని, గోదావరి తీరంలోని జ్ఞాపకాలను కొన్ని పొటోలు తీద్దామనుకున్నా కాని ఎండవేడిమి ఎక్కువగా వుండటం  వల్ల ఎక్కడకీ వెళ్ళలేకపోయాను.

సాయత్రం ఆరుగంటలకు హైదరాబాదుకు ప్రయాణమయ్యాను. నేను ఎక్కిన తర్వాత స్టాపులో ఒక అతను ఎక్కాడు. కొద్ది సేపయ్యాక  నన్ను పలకరించాడు. నాపేరు, నావివరాలు అన్నీ చెబుతుంటే కొంచెం ఆశ్చర్యమే అనిపించింది. మెల్లగా చెప్పాడు 8వ తరగతిలో నా క్లాస్ మేట్ అని. నిజానికి నాకు మొదట గ్ర్తురాలేదు. మా తరగతి(1972-73)లోని ఇతర క్లాస్ మేట్స్‌ను   గుర్తుకుచేసుకున్నాము. నిజానికి నేను 9వ తరగతినుండి ఆ వూరు వదిలివేయడంతో చాలా మంది గుర్తులేరు. కానీ ఆ సమయంలో సుమారుగా 60 నుంది 80 వరకు మా క్లాస్ మేట్స్, సీనియర్స్‌ను, టిచర్స్‌ను గుర్తుకు చేసుకున్నాము.   అదే సంవత్సరంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం, అది మాజీవితాలపై చేసిన ప్రభావం, ముక్యంగా ఆరోజుల్లో లెక్కల్లో - కాంపోజిట్ లెక్కలు  ప్రత్యేకంగా వుండటంతో తొమ్మిదవతరగతిలో పడ్డ పాట్లు గుర్తుకొచ్చాయి.  

ఆనాటి నా ఫోటో 

నాకు ఈ విషయాలను బ్లాగులో పంచుకోవలని ఎందుకనిపించిందంటే - 36 సంవత్సరాలతర్వాత కలిసిన ఒక బాల్య స్నేహితుడు,  ప్రయాణపు తొందరలో కూడా  గుర్తుపట్టడం.
జ్ఞాపకాన్ని పదిల పరచిన బాల్యానికి - కోటి దండాలు
మిత్రుడి శేషావతారం కి శతకోటి దండాలు

Monday, March 8, 2010

మహిళా దినోత్సవ సందర్భంగా- కొన్ని జ్ఞాపకాలు


ఈరోజు చాలా విషయాలతో టపా రాయాలని వుదయమే అనిపించింది. కొన్ని ఆలోచనలు మనసున తొలిచాయికూడా. ఆఫీసుకు వెళుతూ కొన్ని మననం చేసుకున్నాను. ఆఫీసులో అడుగు పెట్టాక దాని సంగతే మరిచిపోయా. ఇదిగో ఇప్పుడు(సాయత్రం 7.50గంటలకు)  మళ్ళీ గుర్తుకువచ్చింది.
మననం చేసుకున్న విషయాలు ఒక్కటికూడా గుర్తు రావటంలేదు.
అయినా చిన్న ప్రయత్నం 
-- 0 --
అమ్మనుగురించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే వుంటాయి.
క్రైస్తవనమ్మకం ప్రకారం బంగారువీధులున్న  పట్టణానికి  అమ్మను కలవటానికి నేనూ ఓ రోజు వెళతాను.
తను మోకరించిన వేకువ జాములు, తొలివెలుగుల పక్షుల కిలకిల రావాలతో గొంతుకలిపి ఆలపించిన స్తుతిగీతాలు ఇంకా చెవుల్లో మారుమ్రోగుతూనే వున్నాయి.
నిద్రలో మరో కల
అడుగులు నేర్వని
బుడుగు పాదాలను కడిగిన వేళ
జారుడు వూగిసలాటలో
మెరిసిన బిందువుగా
ముద్దుల వర్షంలో ఆవిరయ్యాయి
పదంనేర్చి పథం ప్రాకులాటలో
పొరలమాటున దాగిన
ఈ వన్నె దేహాన్నంటి
జారుతున్న బిందువులపై
ప్రసరించి మెరిసిన కిరణపు వెలుగు
తళుకు కాంతులైనప్పుడు
నీ ఆశల కిరణాలుగా చుటుముట్టాయి
నాకోసం పరిశమించిన పాదాలను ముద్దాడలనివుంది
నేనందుకోలేని దూరంలో నీ పాదాలు
ని రెప్పలు నిద్రలో మరోకల కంటున్నాయి
నా కోసం
--0--
ఊహ తెలిసినప్పుడు నాతో నడిచి, నాకు ఎన్నో నేర్పించి దిశా నిర్దేసాల ఆలోచనా గమనం.    
తను డాక్టరైతే నేను కాంపౌడర్ని, తను ఓ కొట్టుపెడితే నేను సామను అందిచే కూలివాణ్ణి ఇలా ఎన్నో ఆటలలో, వయసులో తనే నాముందున్నా భోజనం దగ్గర మాత్రం నేదే ముందు.

యువతగా వున్నప్పుడు తను చదివిన పుస్తకాలను నాకు చెబుతున్నప్పుడు నాకు తలనొప్పి తెస్తుందనుకున్నా, ఇప్పుడిప్పుడే సాహిత్యాన్ని అద్యయనం చేస్తున్నప్పుడు ఆమే నా ఎదురుగా ఎవో వివరిస్తున్నట్లే అనిపిస్తుంది     అమె నా అక్క. నా ఆలోచనా ధారకు అంబులపొది.
జ్ఞాపకాల వాకిటముందు ప్రణమిల్లుతున్నాను 
--0--

ఈ సందర్భంగా నా ప్రక్కటెముకగా అతుక్కుపోవడానికి నాతో నడచివచ్చిన , నా సహచరికి (పాతవే  అయినా) ఈ నాలుగుమాటలు 
దృశ్యం-1

మొదటిసారి
ఆమెను కలసినప్పుడు
నీటి చెలమనుకున్నాను
సంవత్సరాలుగా
తోడిన నీటిలో
మునిగిన చెరువయ్యాను.


దృశ్యం-2

సాయంకాలం
గోదారి ఇసుకతెన్నెలపై
ఆమెను కలిసాను
పరిచయాలు స్నేహం ఇష్టం
ప్రేమగా మారాయి

సంవత్సరాల తర్వాత
అదే గోదారి
అదే ఇసుక
నడుస్తూ గడిచిపోయిన గతంలో
ఆమె నదిగా మారిపోయింది

నేనే చెలమగా చూస్తుండిపోయా
--
అందుకే ప్రేమిస్తున్నానని కాకుండా ఇంకా ప్రేమిస్తున్నానని చెబుతున్నా.   
-- 0--

 
వసంతగానం ఎప్పుడూ మదురంగానే వుంటుంది.
నన్ను కన్న అమ్మను ఎన్ని సార్లు అమ్మా అని పిలిచానో గుర్తులేదుకాని, నాచిన్ని తల్లులు ఎదపై ఆడుకున్న బుల్లి పాదాల ముద్రలు నన్ను నిత్యం పరవసింప చేస్తూనేవుంటాయి.
అమ్మా అనిపిలవటం కన్నా ఏమి చెయ్యగలను.

--0--
మొన్నీ మద్యే ఎదో సందర్భంలో  మహిళ పదానికి నిగంటువు వెదికాను.    భూమినుంచి వచ్చినది అనే స్పురణ కలిగింది. ఆ ఓర్పు, సహనం, ప్రేమ, కరుణ, ధీరత కలిగిన  మహిళలందరికి శుభాకాంక్షలు.
--0--
జ్ఞాపకాలు ఎప్పుడు వెంటాడుతాయి? జరిగిపోయినది ఎదో కళ్ళెదుటలేనప్పుడే కదా! బహుశ మీరు భౌతికంగా ఇక్కడలేని అమ్మను మాట్లాడుతున్నారా??
బంగారు వీధులున్న పట్టణానికి వెళ్ళిన అమ్మ దగ్గరకు నేనూ వెళతాను చెప్పటానికి మీరు చేసింది సాహమే అనిపిస్తుంది నాకు.
మీకు జ్ఞాపకమొస్తున్న శబ్దరాగాలు కొంచెం హృదయపు చెవినిపెడితే మాకూ లీలగా వినబడుతున్నాయి.
అవును నిజమే!
అమ్మ ఎప్పుడూ మనకోసమే కలకంటూ వుంటుంది
అది బాల్యంలో లాలపోసి తడిసిన దేహాన్ని ముద్దులతో ఆవిరిచెయ్యాడం వెనుక
ఆమెలోదాగిన ప్రేమ ఎంతఘాడంగా వుంటుందో కదా!
శ్రమకు కారే బిందువుల్లోంచి సాధిస్తున్నవి విజయాలైనా అమ్మకు వెలుగుచిమ్మే నవ్వులకన్నా సహచర్యమెంతో గొప్పగా పలవరిస్తుంది.
అన్నిటిని గుర్తించిన అక్షరాలు అభినందనీయమైనవి. స్నేహితులుగా, బాల్యమిత్రులుగా అక్కా తమ్ముళ్ళు, అనా చెల్లెళ్ళుగా వుండటం ఒక మధురమైన అనుభూతే అయినా దాన్ని గుర్తుంచుకోవడం, నిలుపుకోవడం నిజంగా ప్రశంసనీయం.
----

"ఈ సందర్భంగా నా ప్రక్కటెముకగా అతుక్కుపోవడానికి నాతో నడచివచ్చిన , నా సహచరికి" ఈ వాక్యాలను చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా ఎదో తెలియని కొత్తదనం కనిపిస్తుంది. ఏమిటా కొత్తదనం అనేది అర్థం కావటంలేదు.
ఇక రెందుదృశ్యాలను చూస్తూ చదువుతున్నప్పుడు ఎప్పుడో చూసిన క్లియోపాత్రా సినిమా గుర్తుకొచ్చింది. అందులో ఎవ్వరికి తలవంచని సీజర్ (రోమా చక్రవర్తి) ఐ బవ్ అని మోకాళ్ళపై అమె ముందు నిలబడతాడు.
అలా మీరు కనిపిస్తున్నారు.
--- పిల్లలను అమ్మా అని పిలిచి అమ్మను గౌరవిస్తున్నారో
అమ్మను గుర్తు చేసుకుంటూ పిల్లలను ప్రేమిస్తున్నారో
ఇద్దరూ జెండరు ప్రకారం స్త్రీలే కావటం కాకతాళీయమా! ??

నాకూ ఎవేవో రాయల్నిపిస్తునాదండోయ్ మీ టపా చదివాక

అభినందనలు
అపూర్వ