Wednesday, November 21, 2007

బ్లాగ్విషయం - స్నేహం-1

బ్లాగ్విషయం - స్నేహం

ఇందులోనుండి నేను నా స్నేహితులు అని కొన్ని జ్ఞాపకాలను రాస్తున్నాను.

ఎలిమెంటరీ స్కూలు మిత్రులు ఎవ్వరూ గుర్తు రావడంలేదుబహుశ 1వ తరగతిలో(1965) అనుకుంట బిక్కి(అసలు పేరు గుర్తురావటంలేదు) అనే అమ్మాయి ఉండేది. 7వ తరగతి తర్వాత ఆ అమ్మాయిని చూసిన గుర్తు కూడా లేదు.
6వ తరగతిలో అనుకుంటా హనుమతరావు పరిచయం అయ్యాడు ఒకే కాలనీ కావటం వల్ల. 7వ తరగతిలో వెంకటెశ్వరరావు నేను ఒకే బల్లపై కూర్చోవడవంవల్ల స్నేహం ఎక్కువ అయ్యింది. హనుమంతరావుకు అది కోపం వచ్చి స్నేహితుల్ని జట్టుగా ఛెసుకొని కొట్టుకునేదాకా వచ్చింది. అది ఇంట్లో పెద్దవాల్లకు తెలిసి(1971) 7వ తరగతిమొట్టమొదటి పబ్లిక్ పరీక్ష దృష్టితో చదువుమీద పెద్దలనిఘా పెరిగింది. దానితో స్నేహం కంటే చదుపై శ్రద్ద ఎక్కువయ్యింది. తర్వాత వెంకటెశ్వరరావు వాళ్ళ వూరికి(అమరావతి) వెళ్ళి పోవటం, 8వ తరగతిలో నేను హనుమంతరావు ఒకే తరగతి సెక్షను కావటంతో మళ్ళీ స్నేహం మొదలయ్యింది. (1972) జై ఆంద్ర గొడవలతో స్నేహితులూ లేరు, చదువూలేకుండా సవత్సరం గడచిపోయింది. ఐతే ఈ కాలంలో రామచంద్ర, ఇంకొకడు(పేరు గుర్తులేదు) లైబ్రేరీ పేరుతో డిటెక్ టివ్ నవలలు చదవటం, నాటకాలు రిహార్సిల్సు అంటూ తిరగటం, బషాతొ కల్సి బొమ్మలజూదం అలవాటయ్యింది.
లాభంలేదని ఆవూరునుండి ఏలూరుకు అందులోనో బాలుర ప్రతేక స్కూలులో 9వ తరగతికి చేర్చారు. హనుమంతరావుకూడా అనుకో కుండా అక్కడచేరాడు.కొన్నిరోజులు బుద్దిగానే వున్నాము. ఓరోజు "రాధమ్మపెళ్ళి" సినిమాకు మద్యాహ్న స్కూలు ఎగ్గొట్టి వెళ్ళాము. అది మా తరగతి మాష్టారుకు తెలిసి పెద్దలను పిలిపించి, తిట్టి మాయిద్దరిమద్య నిఘా నియమించారు. మళ్ళీ మేము 10వ తరగతి అయ్యే వరకూ మాట్లాడుకోలేదు.

Labels:

2 Comments:

At November 21, 2007 4:48 PM , Blogger బ్లాగాగ్ని said...

బావున్నాయి మీ బాల్యస్నేహితుల సంగతులు. చిన్నతనంలో నేనూ కొంచెం అటూఇటూగా ఇలాంటి కోతిపనులే చేసేవాడిని.

 
At November 22, 2007 10:59 AM , Blogger radhika said...

బావున్నాయి సంగతులు.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home