Monday, August 18, 2014

నేనూ నా వంటలు


***
సంవత్సరమేదో గుర్తులేదు కానీ, అప్పుడే హైదరాబాదు వచ్చిన కొత్త. మల్కాజగిరిలో అన్నయ్యతో పాటు ఉండటవల్ల అవసరార్దం వంట చెయ్యాల్సి వచ్చింది. మోండా మార్కెట్టుకు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏమి దొరుకుతాయో చెప్పాడు అన్నయ్య. ఓ రోజు నేను ఒక్కడ్ణే వెళ్ళాను. అక్కడ నన్ను ఒక కూరగాయ ఊరించింది. అవి తీసుకున్నప్పటినుంచీ ఎప్పుడు వండుదామా అని కుతూహలంగా ఉండింది.

నాకు బాగా గుర్తుంది ఆ రోజు ఆదివారం, చర్చికి సనత్‌నగర్ వెళ్ళేవాళ్ళం. సంజీవరెడ్డినగర్‌లోని రావుగారింట్లో అన్నయ్య స్నేహితులు కలిసేవారు. వారందరికి అది పోస్టల్ చిరునామా అడ్డా. ఎందుకంటే రావుగారిది సొంత ఇల్లు కాబట్టి.
చర్చి వెళ్ళాలనే కంగారు ఒక ప్రక్క, నాకిష్టమైనవి వండాలని ఒక ప్రక్క. అన్నయ్య లేచేసరికి కూర వండేసాను. అన్నయ్య లేస్తూనే ఏమి వండావు అని అడిగాడు, చెప్పాను. తీరా బ్రెష్సు చేసుకుని తినడానికి కూర్చున్నాక అడిగాడు.
చిక్కుడు కాయ అన్నావు ఇదేదో తేడాగా ఉందే అని. క్రిందా మీదా కూరను చూసి, వలిసిన పొట్టుపరీక్షించి తేల్చిన దేమంటే నేను వండింది చిక్కుడు కాయలు కాదు. 

మరేమనుకున్నారు! పచ్చి బటాణీలు. తొక్కతో సహా వండేసరికి కొద్దిగా వగరగా వుంది. కూరతో తినకుండానే లేచిపోయాడు.
ఇంతకీ విషయం ఏమిటంటే గింజలున్న చుక్కుడు కాయలు అనుకుని బటాణీ కాయలు తెచ్చి వండాను. అంతకుముందు బటాణీలను పచ్చి కాయలు చూడకపోవడం వలన, గింజలున్న చిక్కుడు కాయలు అనుకోవడం వలన ఇంత గందరగోళం.


సాయత్రం మాంసం తెచ్చుకుని వండినా, కూరమొత్తం  పడెయ్యలేక మొత్తం నేనే తిన్నాను.




   

Friday, June 6, 2014

4th June, 1984-2014 మధ్య జ్ఞాపకాలు


జ్ఞాపకాలను తాజా పరచుకుని దానిద్వారా దేవుడు చేసిన మేళ్ళనుబట్టి  స్తుతించడానికి దేవుడు సమయాలను ఇస్తుంటాడు. ఆ సమయాలలో ఎవరైతే ఉంటారో వారికే జ్ఞాపకానుభవం ఉంటుంది.


4.6.2014 at LIG, RC Puram, Hyderabad
గత సంవత్సరం మనమధ్య వున్న నాన్న ఈ రోజు లేరు, 
4.6.2013 at LIG, RC Puram, Hyderabad
అయినా ఇదే రోజు నాటి జ్ఞాపకం ఉంది.
 ***

1984 నాటి కొన్ని సంగతులను పిల్లలముందు పంచుకోవడానికి సమయమిచ్చినందుకు దేవునికి వందనాలు.
4.6.1984 at Nalgonda

1984 నాటికి నేను మధ్యప్రదేశ్, జబల్‌పూర్ వద్ద పనిచేస్తున్నాను. అక్కడనుంచి హైదరాబాదు వచ్చి, హైదరాబాదునుండి నేరుగా నల్గొండ పెళ్ళికి వెళ్ళడం జరిగింది. 
వెళ్ళగానే నాన్నను కలిసి రెండువేల రూపాయలను ఆయన చేతిలో పెట్టాను. ఆయన ఆశ్చర్యానికి అంతులేదు. తర్వాత వేరే సందర్భంలో కూడా తన ఆశ్చర్యాన్ని నాన్న నాతో పంచుకున్నారు.
జబల్పూర్ నుండి మళ్ళి జబల్పూర్ వెళ్ళే వరకు ఐదు రూపాయల కొత్త కట్టను కర్చు పెట్టడం ఎప్పటికీ మర్చిపోలేనిది.

ఇప్పటి ఉద్యోగారీత్యా నెలకు కొన్ని లక్షలను జీతాలుగా ఇస్తూవుంటాను, కానీ దానిలో ఎప్పుడూ ఆనంద ఆశ్చర్యాలు లేవు గాని ఆ అయిదు రూపాయాల కట్టను (రూ.500/-) ఖర్చు పెట్టడం గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా గొప్ప అనుభవం అనిపిస్తుంది.
***
లింకన్ అన్నయ్య పక్షవాతంతో (Sept.2001) NIMSలో ఉన్నప్పుడు పరిచర్యకోసం ఎక్కువ సమయం నేను గడిపాను.  ఇంటికి వచ్చేవరకూ ప్రతినిముషం ఇదే చివరి నిముషం అనిపించేంత ఉత్కంఠ అనుభవం.
రెండు ప్రత్యేకమైన అనుభవాలు
ఒకరోజు మధ్యాహ్నం ఎక్కిళ్ళు ప్రారంభమయ్యాయి. మొదట ఒక టానిక్ ఇచ్చారు తగ్గలేదు, ఇంజెక్షను చేసారు తగ్గలేదు. సాయంత్రం అయిదు ఆ ప్రాంతంలో నర్సు చెప్పింది ఫీజ్డ్ సెలైన్ తెమ్మాని. NIMS  బయటికి వచ్చి మూడు గంటలపాటు షాపులన్నీ తిరిగాను గని ఫ్రీజ్డ్ సెలైన్ దొరకలేదు.
వార్డులోకి వస్తుండగా చెప్పారు వార్డ్ మెడికల్ రూములో ఫ్రిజ్ వుందిగా అందులో పెడితే ఫ్రీజ్ అవుతుంది కదా అని. తీరా అక్కడికి వెళితే నర్సు తాళంవేసి ఎటో వెళ్ళిపోయింది. తాళం దొరికేసరికి రాత్రి 10:30 అయ్యింది. ఎంతగా శారీరకంగానూ, మానసికంగానూ ఆ సమయంలో అలిసిపోయాననిపించింది. ఇది చివరి సమయం అనిపించింది. దేవుడు విడిపించాడు.

ఎన్ని రోజులైనా మార్పు కనిపింకపోవడంతోనూ, బెడ్దులు కావల్సిన వత్తిడితోనూ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అలా చెయ్యవద్దని, కనీసం పైడ్ గదులకైనా మార్చమని అడిగాను. ఎవ్వరి దగ్గరకు వెళ్ళినా కాదు అనే జవాబే. విసుగు చెంది ఒక చోట కూర్చుండి పోయాను. ఎవ్వరో అటువెల్టూ ఆర్. ఎం.ఓ. మిమ్మల్ని పిలుస్తున్నారు అనిచెప్పారు. ఏమి వినాలో అనుకుంటూ వెళ్ళాను. ఎవరో ఫోను చేసారని, రూముకు మారుస్తున్నామని చెప్పారు. అప్పటికి సమయం రాత్రి 12:00 గంటలు ఆ ఫోను చేసింది ఎవ్వరో తెలియరాలేదు. నేనూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు గనుక.

ఆ NIMS అనుభవం నా జీవితంలోనూ, నా అధ్యాత్మికతలోనూ చాలా మార్పు తెచ్చింది. బైబిలును పరిశిలనగా చదవ నారంభించి, చాలా తీక్షణంగానే చదివాను అనిచెప్పాలి

***
అనుభవంలో వున్నప్పుడు అనుకూలంగా లేనివాటికి మనసు, పరిస్థితులు, పరిసరాలు ఇబ్బందిగా ఉన్నాయనిపిస్తుంది. వాటిలో నిలబడి ఉన్నప్పుడే దాటి రాగలిగినప్పుడే సాక్ష్యంగా మిగులుతుంది.

పరిస్థితులకు అననుకూలతలకు తలొగ్గినప్పుడు ఆ బాధల్లోనే కొట్టుమిట్టాడుతుంటాము.

***
1 తిమోతికి 6: 5-8 వచనాలలో
5. చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
7. మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.
8. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.

***
ఆయా సమయములలో అలా ఉన్నప్పుడు పౌలు మాటలు విశ్వాసానికి కొత్త బలానిస్తాయి.
**
కీర్తనలు 76:1
1. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు
ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.

ఈ వాక్యములో యూదాలో బదులు మనమున్న స్థలాన్ని
ఇశ్రాయేలులో  బదులు మన ఇంటిపేరును ఆయన నామము గొప్పది. అని చదివి చూడండి

అంటే
ఆర్.సి. పురంలో దేవుడు ప్రసిద్ధుడు
కనుమూరివారిలో ఆయన నామము గొప్పది.

ఎందుకంటే నిన్న నేడు రేపు ఏకరీతిగా వున్న దేవుడు  ప్రసిద్దుడుగా వుండాలని
ప్రతి గృహములో ఆయన నామము గొప్పగా ఉండాలంటాడు.
మన ద్వారా ఆయన గొప్పదనాన్ని చాటడానికి ఒకొక్క సమయంలో ఒక్కోలాగా ఉంచుతాడు. మనకు ఇష్టమైనవి, ఇష్టమైవాళ్ళు లేకపోవడంవల్ల అంత బాగా లేదనిపిస్తుంది అయినా
"అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము"

ప్రతి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు

Wednesday, May 28, 2014

ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటాము


ఒక్కోసారి ఒకానొక సమయానికి చిక్కి ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటాము. 

అలా ఎందుకు జరిగింది
బయటికి ఎలా రావాలి
చుట్టూవున్న వాతావరణం ఏమిటి అని అలోచించేలోగా కాలం దొర్లిపోతుంది.

ఇరుక్కున్న కాలంలోనే ఏదో తెలియని వత్తిడి, సందిగ్దత ఏర్పడతాయి.
ఇప్పుడు నా పరిస్థులు అలానే అన్పిస్తున్నాయి.

కాలేజీ చదివే రోజుల్లో ఇలాంటిదే ఒక అనుభవం. (ఓ 34 ఏళ్ళ నాటిది) 

పశ్చిమ గోదావరిలోని తణుకు, దువ్వలలో నాకు మేనమావ వరుస అయ్యేవారు వుండేవాళ్ళు. అంతకుముందెప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. తణుకులో నా స్నేహితుడొకడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. వాడి దగ్గరికి ఒకసారి వెళ్ళాను, అక్కడికి దగ్గరే కదా అని దువ్వ వెళ్ళాను.  వాళ్ళ పిల్లలు నాకంటే చిన్నవారవటంతో ఆటలు, కాలవలో స్నానాలు సరదాగానే గడిచింది.  వెళ్ళిన సాయంత్రమే మావయ్య నాదగ్గరకు వచ్చి ఒరే నీ దగ్గర వున్న డబ్బులు ఇవ్వు రేపు ఇస్తాను అంటే నా దగ్గర వున్నవన్నీ ఇచ్చేసాను. (వందలూ, వేలూ ఏమీ కాదు).


ఆయన ఇబ్బంది ఏమిటో నేను  ఆ వయసులో తెలుకోలేకపోయాను గానీ, నేను మాత్రం సుమారు ఒక వారం రోజులు ఇరుక్కుపోయాను. 

మొదటి రెండు రోజులూ బాగానే గడచినా తర్వాత నాకూ అక్కడ గడపటం ఇబ్బంది కరంగా అనిపించేది అయినా కదలలేని స్థితి .  

Tuesday, May 20, 2014

కాలంలో మార్పు సహజం-పాతపట్టిసం



ఇక్కడే నా బాల్యం వెల్లివిరిసింది

ఒకొక్కరుగా నేస్తాలు జీవనంలోకి నడుస్తూ చెదిరిపోయారు
ఎవ్వరు ఏ సమయంలో వచ్చి తమ పాదముద్రలకు మోకరిల్లుతున్నారో

ఇప్పుడక్కడ అభివృద్ది
రహదారై తరలిపోతుంది
ఆ గోదారి విరామమెరుగక ప్రవహిస్తూనే ఉంది
కుంచెకు దొరకని ఎన్నో బాల్యజ్ఞాపకాలు
మనసుపొరల్లో మసకబారుతున్నాయి

బాల్య నేస్తాల్లారా
ఇప్పుడు మీరు ఎదురైనా గుర్తించలేనట్లే
మనం ఈ ఇసుకలో ఆడిన ఆటలు
ఈ కట్టడాలక్రింద నలిగిపోయాయి


పాతపట్టిసం(ప.గో. జిల్లా) గ్రామంలో 3వ తరగతివరకు నా బాల్యం గడిచింది. అక్క సలోమి పంపిన పోటోలు


Saturday, January 4, 2014

when I look 2013


సంవత్సరాన్ని నెలలు నెలలుగా విభజించి బేరీజువేసుకున్న ధాఖలాలు లేవు. కానీ 2013 ఎందుకో బేరీజుల తక్కేడలో నా కళ్ళముందు కదలాడింది.
తొలిమాసంలోనే కొంత అలజడి, ఆ అలజడి  సంవత్సరం పొడుగునా వెంటాడింది అనే చెప్పవచ్చు. పని బాద్యతలవిషయంలో  తలెత్తిన   అలజడి ఒక అవగాహన రాకుండానే కొన్ని నెలలలు గడచిపోయి, మళ్ళీ ఆ పనే నేనే బాధ్యవహించవల్సి వచ్చింది. ఈ అలజడి కొంత మనస్థాపాన్ని కలిగించి అవమానంగా మనసుకు తోచింది మనసుకు. కానీ ఏమి చెయ్యాలి ఆపరేషన్‌వల్ల కలిగిన శారీర మార్పువల్ల కొంత నన్ను నేను నిగ్రహించుకోక తప్పలేదు.
నన్ను,  నా  శరీర పరిస్థితికి సహాయం చేస్తున్నామనుకుంటూనే గాయపరచటం జరిగింది. మాట వినని  మనసు  గాయం అలాగేవుంది. చదువుతున్న బైబిలు సత్యాలనుంచి, యేసు చెప్పిన ప్రేమించమన్న  నూతన ఆజ్ఞను మననం చేసుకోవడంద్వారా పాటించాలనుకోవడంద్వారా కొంత వుపసమనం స్వగాతానికి  జరుగుతున్నా, బంధాలమధ్య  సమన్వయం కాకుండానే పోతుంది. దానికి లోలోపల ఉన్న "ఇగోను" శాంతపర్చడం కష్టంగానేవుంది. 
గుండె బాగానే పనిచేస్తున్నా సహాయసహకారాలిచ్చే అవయవాలు ఒక్కోసారి మొండికేయడంవల్ల పరీక్షలు, పరీక్షల ఫలితాలకై ఎదురుచూపులు, జేబుకత్తిరింపులు తద్వారే వచ్చే వత్తిడి కొన్ని నెలలను మింగేసి, నాకు మందుబిళ్ళల(టాబ్లెట్ట్లు) సంఖ్యను పెంచాయి. మళ్ళీ అదో జేబుకత్తిరింపు.

కొన్ని అనువాదాలు మొదలుపెట్టినా పూర్తి చెయ్యలేకపోయాను.  ఎం.ఎ. తెలుగు గతసంవత్సరం రాయని పేపర్లను రాయలేకపోయాను.
గురువుగారి సూత్రం కొత్త పుస్తకాలు చదడం, సంపాదించడం ...ఈ విషయంలో కూడా వెనుకంజ అయ్యింది.
నా ప్రక్కటెముకకు సాహిత్య స్నేహితుల పట్లకలిగిన సందేహం అలాగే కొనసగుతున్నది. సాహితీ మిత్రులెవరూ ఇంటికివచ్చి పలుకరించలేదని అమె మాట. నిజమే కావొచ్చు. ఈ విషయాన్ని ఎలా అర్థంచేసుకోవాలో తికమక పడుతూనేవున్నాను. అందుకే ఎక్కువ సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనలేదు.
కావాలని పిలిచిన వారుకూడా తీరా వెళ్ళాక పట్టించుకోనితనం, ప్రాముక్యతలేని సమయాన్ని  కేటాయించడంలాంటి సంఘటనలు అవమానంగానో, మనసుకు కష్టంగానూ తోచాయి.

2013
కొందరని కొల్పొయాను.. (4) చూసి వద్దమని, పలకరిద్దమని అనుకున్న కానీ శారీరక పరిస్థితులవల్ల వాయిదా వేస్తూ వచ్చాను

చెయ్యలనుకున్నవి చెయ్యలెకపొయ.

మొన్నె మా స్నేహితుల మూడు జంటలు  కలిసుమున్నము

సాహిత్య మిత్రులు  ఎవ్వరు ఆపరేషన్  అయ్యక ఇంటికివచ్హి పలకరించలెదనే నా ప్రక్కటెముక ప్రశ్న ......బ్లంక్గా మిగిలిపొయింది.

చెప్పు తగ్గట్టూ ఎమి రాయలేదేమో




ఫేసు బుక్కులో పాత మిత్రులు మెల్లగా వెనుకకు వెళుతున్నట్టు కనిపిస్తుంది. కొత్తవారు రోజు రోజూ కలుస్తూనేవున్నారు.

ఇవన్నీ ఎలావున్నా బైబిలు చదవడం, నమ్మిన యేసుక్రీస్తు యందు విశ్వాసముంచడంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు.
ప్రతీవారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళగలగటం గొప్పవూరట.

Sunday, December 8, 2013

పరోక్ష గురువులు - 1 మృణాలిని

ఈ మధ్య నా కవితా ప్రయాణంగురించి మాట్లాడే అవకాశంవచ్చింది. ఏమి మాట్లాడాలి అని పదిరోజులపాటు (కాలేజీలో పరీక్షలకు సిద్ధపడినట్టు) సిద్దపడ్డాను.   ఆ నేపద్యంలో నాకు నన్ను ప్రభావితంచేసిన వారు గుర్తుకొచ్చారు.

వారిలో : మృణాలిని చుండూరి

నా అక్క 70వ దశకంలో నవలలు బగా చదివేది. అక్కకు నవలలు నేనే తెచ్చిపెట్టేవాణ్ణి చాలాసార్లు. అయినా నవలలు చదవడం నాకు అంతగా వంటబట్టలేదు. ఆరోజుల్లో అక్క నోటిద్వారా మృణాలిని పేరు విన్న గుర్తు. నిజానికి ఆమె ఏమి ఏమి రాసారో నాకైతే అవగాహనలేదు.
   నేను ప్రత్యక్షంగా మృణాలిని గారిని 2004 డిశెంబరులో తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో కలిసాను అంతే.  అమె ప్రసంగించిన సాహిత్యకార్యక్రమాలను కొన్ని పాల్గొనడం జరిగింది. అయితే
ఆమె బిబిసి అనుభవాలను ఎప్పుడో చదివిన/రేడియోలోవిన్న  గుర్తు. అందులో ఆమె ఇవ్వబడ్డ సమయాన్ని సమన్వయంచేసుకుంటు, వార్తను తర్జుమా చేసుకుంటూ, ఎడిటింగు చేసుకుంటూ వార్తలను చదవడం గురించి తన అనుభవాన్ని చెప్పారు.
 నాకు అలాంటి సందర్భం  ఎదురయ్యినప్పుడు ఆ అనుభవాలు  ఉపకరించాయి. అందుకే ఆమె నా పరోక్ష గురువు.

నా అనుభవలంలోకి వచ్చిన సందర్భాలు కొంచెం వివరంగా
 సాధరణంగా కొన్ని కార్యక్రమాలకు అథిదిగా పిలిచి, మాట్లాడవలసిన అంశాన్ని ఇస్తారు. మాట్లాడే అవకాశం రావడం, ఆహ్వానించిన వారిని బట్టి ఆహుతులను అంచనావేయడం, కొందరు పెద్దలు వుంటారనే ఊహ కొంత ఉద్వేగానికి లోను చేస్తుంది. జాగ్రత్తగా మాట్లాడటంకోసం పగడ్బందీగా మాట్లాడనేవుద్దేశంతో మరింత శ్రద్దతో నోట్సు తయారుచేసుకునేవాణ్ణి. తీరా సభ  ప్రారంభం ఆలస్యం కావడమో,  అథిదుల క్రమమం మారిపోవడమో, అంశాలు ఎక్కువ అవ్వడమో, మొదట మాట్లాడినవారు మొత్తం సమయాన్ని తినెయ్యడమో, సాంకేతిక ఇబ్బందులో(కరెంటు, మైకు..వగైరా), ఇలాంతి కారణాలవల్ల నిర్వాహకులు సమయాన్ని పరుగెట్టించాలని చూస్తారు. మనకిచ్చే సమయాన్ని కుదించమంటారు. అదీ చెవిలో చెప్పకుండా మైకులో చెబుతారు. అది కొంచెం వత్తిడిని పెంచుతుండేది. మొదట్లో చాలా వత్తిడి అనిపించేది, మాట్లాడాలని సిద్ధంచేసుకున్నవి తికమక అయ్యేవి.

ఇలాంటివి చర్చిలోనూ, సాహిత్య సభలలోనూ అనుభవానికి వచ్చాయి. అప్పుడు మృణాలినిగారి మాటలు పదే పదే గుర్తు చేసుకుని, నిర్వాహకుల అసహాయతను, ఆత్రాన్ని సహృదయంతో   అర్థంచేసుకుని నన్ను నేను, నేను మాట్లాడనుకునే  అంశాలను కుదించుకోవడం అభ్యాసం చేసాను. అందుకే  ఆమె నా పరోక్ష గురువు 
 
కొసమెరుపు ఏమిటంటే మాట్లాడవలసిన ఈ సందర్భంలో కూడా సమయాన్ని కత్తిరించారు. ఏ వత్తిడిలేకుండానే   సమయాన్ని కుదించుకున్నాను.  :)

(ఫొటో నేను తీసిందే)

Thursday, November 28, 2013

గురువులను జ్ఞాపకం చేసుకోవడం భాగ్యమే-5-శ్రీ అద్దేపల్లి

14,15 డిశెంబరు 2004 పాల్గొన్నప్పుడు

అద్దేపల్లి గారితో పరిచయం నెలనెలావెన్నెల్లో జరిగింది. నేను రాస్తున్నవి కొన్ని ఆయనకు పోస్టులో  పంపాను. వారం తిరక్కుండానే ఆయన దగ్గరనుండి జవాబు వచ్చింది. తర్వాత తరచూ ఫోనులో మాట్లాడటంతో సాన్నిహిత్యం పెరిగింది. కొన్ని సాహిత్య కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు సాన్నిహిత్యం మరింత పెరిగింది.


ఎక్స్‌రే, విజయవాడ వారు నిర్వహించిన 24 గంటల కవిసమ్మేళనంలో (14,15 డిశెంబరు 2004) పాల్గొన్నప్పుడు ఎక్కువ సమయం ఆయనతో గడపటం జరిగింది.

నా దీర్ఘ కవిత "హసీనా" ముందుమాట రాసి చర్చలో (30 డిశెంబరు, 2004) పాల్గొన్నాని నన్ను ప్రోత్సహించారు.


అపరంజి పైన్ ఆర్ట్స్, ఏలూరులో జరిగిన కవితావలోకనం, కవితోత్సవం (12.11.2005)లలో ఆయనతో వేదిక పంచుకోవడం జరిగింది.

ఆయన దగ్గర నేను గమనించిందీ, నేర్చుకున్నదీ ఒక విషయం.
అప్పుడప్పుడూ సాహిత్య కార్యక్రమాలలో జరిగే ఆలశ్యాలను బట్టి నిర్వహకులు సమయాన్ని కుదించాలంటారు. ఆకస్మికంగా జరిగే ఆ వత్తిడిలో సమన్వయాన్ని పాటించడం మరియు చెప్పాలనుకున్న విషయాలను ఎడిట్ చేసుకుని తడబాటులేకుండా మాట్లాడగలగటం ఆయనకున్న నేర్పరితనం. బహుశ ఆయనకు సుదీర్ఘ అనుభవంవల్ల వచ్చివుండవచ్చు.
అది గమనించిన నేను చాలా సందర్భాలలో నన్ను ఆహ్వానించిన చర్చిలోనో, సాహిత్య కార్యక్రమంలోనో  నాకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పాటించాను.


అలా గురువువైన శ్రీ అద్దేపల్లి రామ్మోహనరావు గారికి 
ప్రతిష్టాత్మక నాగభైరవ పురస్కారం డిసెంబర్ 15 న నెల్లూరు లో ప్రసిద్ద కవి,విమర్శకులు
డా అద్దేపల్లి రామమోహన్ రావు గారికి ప్రదానం అని కమిటీ ఈరోజు ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను.

Tuesday, October 29, 2013

మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు!

ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.
అలాంటి మూడు సంఘటనలు.
నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ సందేహమే!

                                              (పోలవరం పాండురంగడి కొండ నుంచి  గోదావరి )

1
వయస్సు సరిగ్గా  గుర్తులేదు. బహుశ ఇంకా స్కూలుకు వెళ్ళటంలేదు. అప్పట్లో వయస్సు ఆరో సంవత్సరం వస్తేగాని బడిలో చేర్చుకునేవారు కాదు.
స్థలం మాత్రం పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా). మా రూతు ఆంటీ 12వ తరగతి చదువుతుండేది. మా యిల్లు ఉన్నతపాఠశాల ఎదురుగా వుండటంవల్ల ఆంటీ వాళ్ళ స్నేహితురాళ్ళు తరచూ వచ్చి మంచినీళ్ళు త్రాగి వెళ్ళేవారు. అలా వచ్చేవాళ్ళలో   పురుషోత్తపట్నానికి చెందినవారు వుండేవారు. పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా)  అంటే పోలవరం గోదావరికి ఆవలి ఒడ్డునవుంది. ఆ గ్రామంనుండి  ప్రతిరోజూ పడవపై వచ్చి,  వెళ్ళేవారు.
ఓ రోజు ఒకరి ఇంట్లో ఎదో కార్యక్రమం (నాకు సరిగ్గా గుర్తులేదు) ఉండటంవల్ల అందరూ కలిసి వెళ్ళాలని మాట్లాడుకుంటున్నారు. అందులో ఆహ్వానం మా ఆంటీకి కూడా వుంది. ఆ మాటలు విన్న నేను, నేనూ వస్తానని  చెప్పాను. నువ్వు సిద్ధంగావుండు మేము వచ్చి తీసుకెళతాము అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు పడవ ప్రయాణం అంటే మహా సరదా. పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా) పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా) రెండు ఎదురెదురు ఒడ్డుల మధ్య ఎక్కువ వెడల్పువున్న రేవులని చెబుతారు. కొవ్వూరు రాజమండ్రిల మధ్య వెడల్పు ఎక్కువవున్నా రేవులు మాత్రం ఎదురెదురుగా లేవు.  ఇంతకుముందు ఒకసారి ఆంటీయే తన క్లాస్మేట్ ఇంటికి తీసుకెళ్ళింది.  అందుకని చకచకా సిద్దమయ్యి, చాలాసేపు ఎదురుచూసాను. ఎవ్వరు రాలేదు. ఒకవేళ నన్ను మర్చిపోయి పడవల రేవుకు వెళ్ళారా అని సందేహమొచ్చింది. సరే! అక్కడికి వెళ్ళి  చూద్దాం  అని బయలుదేరాను.  నేను అక్కడికివెళ్ళిన సమయానికి ఒక పడవ వెళ్తూ కనిపించింది. అందులో కొంతమంది విద్యార్థునులు  కనిపించారు. నన్ను మర్చిపోయారేమో అనే సందేహం ఎక్కువయ్యింది. అక్కడే చాలాసేపువున్నాను.
solo-boat-journey


అప్పట్లో అటువైపునుండి ఒక  పడవ ఇటువస్తే, ఇటునుంచి ఒక పడవ అటువెళ్ళేది. అలా అటువైపు పడవ వచ్చింది. పడవవాళ్ళు లంగరులు వేసి బయలుదేరేలోపు వారి వారి పనుల్లో పడిపోయారు. నేను పడవ ఎక్కి కూర్చున్నాను. టిక్కెట్టు ఎమీ ఇవ్వకపోయినా పడవ ఎక్కిన వారిని లెక్కించుకుని, రుసుము వసూలు చేసేవారు. ఇంకా  సరుకులు, సామానులు చూసుకొని  బయలుదేరారు. ఆవలి ఒడ్డు రాగానే  నేను పరుగెట్టుకుంటూ నాకు తెలిసిన ఇంటికి వెళ్ళాను. అక్కడ సందడైతే వుంది కాని, వీళ్ళు ఇంకా రాలేదని తెలిసింది. వస్తారులే అనే ధీమా ఒకవైపు, వస్తారా రారా అనే సందేహం మరోవైపు. అలా ఆ వీధిలో నాలుగు అడుగులు వేసేసరికి గోళీలు ఆడుతూ కొందరు పిల్లలు కనిపించారు. అక్కడికి పడవరేవు కనబడుతూనేవుంది. అటువైపు ఓ కన్నేస్తూనే  మెల్ల మెల్లగా వారితో కలిసిపోయాను. ఎంతసేపు అలా ఆడుతూ ఉన్నానో గుర్తులేదు గానీ కొంచెం చీకటి పడుతున్న సమయంలో ఒక పడవ వచ్చింది. అందులో మా ఆంటీ ఇంకా తన స్నేహితురాళ్ళు ఉన్నారు. నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయారు.  ఆంటీకి భయం మొదలయ్యింది ఇంటి దగ్గర నా గురించి ఏమి కంగారు పడుతున్నారోనని. తన ఫ్రెండ్సు అనునయిస్తున్నా భయంగానే సమయం గడిపింది.
ఆఖరి పడవకు పురుషోత్తపట్నంనుండి  పోలవరం వచ్చేసాము. ఇంటికి వెళ్తే ఎవ్వరు కంగారు పడటంలేదు ఎందుకంటే నేను ఆంటీతోనే వెళ్ళానని అనుకున్నారు. అప్పుడు ఆంటీ స్థిమితపడింది.
నాకు మాత్రం పడవ ప్రయాణం అనగానే అదే గుర్తుకొస్తుంది.

2
1966, పాత పట్టిసం, పోలవరం తాలూకా, పశ్చిమ గోదావరి జిల్లా.
గోదావరిలో శివాలయంవున్న ఊరుగా ప్రసిద్దమైనది.
అక్కడ ఎలిమెంటరీ స్కూలు ఉంది. బహుశ 3వ తరగతి చదువుతున్నాను. అందులో మా పెద్ద ఆంటీ  కటాక్షమ్మ ఉపాద్యాయురాలుగా పనిచేస్తుండేది. నేను చిన్నక్క మేరీ సలోమి, 5వ తరగతి చదువుతూ ఆమెవద్ద ఉండేవాళ్ళం.  అదే బడిలో ఆంటీతో పాటు  శ్రీమతి శాంతమ్మ, లిల్లీ  అని ఇద్దరు  ఉపాద్యాయురాళ్ళు వుండేవారు.
మంగళవారం 4కి.మీ. దూరంలోవున్న పోలవరంలో సంత జరిగేది. అందుకని మంగళవారం స్కూలుకు మధ్యాహ్నంనుండి శెలవు వుండేది.
లిల్లీ గారు తన తమ్ముడు వివాహానికని పత్రిక ఇచ్చి పెళ్ళిపనుల నిమిత్తం శెలవుపెట్టారు.
ఆ రోజు మంగళవారం. మధ్యాహ్నం బడినుంచి వచ్చి కొద్దిసేపు ఆడుకున్నాక స్నానంచేసి మంచి బట్టలు వేసుకున్నాను. అంతలో ఆంటీ శాంతమ్మగారి ఇంటికివెళ్ళి ఎదో తెమ్మని పంపించింది. వారి ఇల్లు ఊరికి ఆ చివరవుండేది. నేను వెళ్ళేసరికి వారి ఇంటికి తాళంవేసివుంది. ప్రక్కన అడిగితే పెళ్లికి వెళ్ళారు అనిచెప్పారు. వెంటనే నాకు లిల్లీ టీచర్ వాళ్ళ తమ్ముడు పెళ్ళి రేపే అని గుర్తుకువచ్చింది. అక్కడికే వెళ్ళివుంటారని  అనుకున్నాను. ఆ పెళ్ళి కొత్త పట్టిసీమ అక్కడికి ఓ మూడు నాలుగు కిలోమీటర్లు వుంటుంది. గోదావరి గట్టు వారగా వుంటాయి ఆ గ్రామాలు. అప్పటికి ఇంకా చీకటి పడకపోవడంతో సరదాగా నడుచుకుంటూ వెళ్ళాను. ఇల్లు ఎలా కనుక్కున్నానో గుర్తులేదుగాని పెళ్ళి ఇంటికివెళ్ళాను    కొద్ది సేపటికి  లిల్లీ టిచరు కనిపించి  ఆంటీగురించి అడిగి తన పనుల్లో తాను కలిసిపోయింది. పెళ్ళి పందిరివేయడం, దాని డెకరేషను పనుల్లో, కాగితాలు అంటించటంలో నేనూ కొద్దిగా సహాయంచేసాను. చీకటి ఎప్పుడుపడిందో తిన్నానో లేదో తెలియదు.  కొద్ది రాత్రి అయ్యాక పెళ్ళికూతురు వచ్చింది. విడిది ఇల్లు ఇచ్చారు. ఏవేవో కార్యక్రమాలతో కొద్దిసేపు సమయం గడిచిపోయింది. విడిది ఇంటికి, పెళ్ళి ఇంటికి మధ్య తిరుగుతుంటే మగ  పెళ్ళివారు నేను ఆడపెళ్ళివారి తరుపున అనుకున్నారు.   ఆడ పెళ్ళివారు నేను మగపెళ్ళివారి తరుపున అనుకున్నారు, పెళ్ళి తంతులో పడి నాకు ఇల్లు గుర్తురాలేదు. ఆ రాత్రి పెళ్ళి పందిరిలోవున్న ఓ బెంచీపై నిద్రపోయాను.
ఉదయమే పెళ్ళి సందడి. అక్కడ నన్ను గుర్తుపట్టేవారు ఎవ్వరూ లేరు. గుర్తుపట్టగలిగే ఒక్క టీచరు చాలా పనుల్లో హడావిడిగావుంది.
పెళ్ళికూతురు తెల్లటి వస్త్రాలు, మేలిముసుగు (వెయిల్) బ్యాండు మేళాలతో పందిరిలోకి తీసుకెళ్ళడం నన్ను అబ్బుర పరిచాయి.
పెళ్ళి అయిపోయింది, భోజనాల దగ్గర శాంతమ్మ టీచరు భర్త వెంకన్న గారు (ఆయనా టీచరే) కనిపించి పలకరించారు.  ఆంటీ రాలేదా? వస్తే ఎక్కడా అని. అప్పుడు గుర్తుకువచ్చింది ఇల్లు. భోజనాల తర్వాత వెళ్ళిపోదాము అనుకున్నా. ఇంతలో వధూవరులిద్దరూ బ్యాండు మేళాలతో వీధిలో ఊరేగింపు వెళ్ళడం కనిపించింది. కొందరు పిల్లలు ఊరేగింపువెనుక నడుస్తున్నారు  ఆ గుంపులో చేరిపోయాను. ఎంత సమయం గడిచిందో గాని, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఇంటికి వెళ్ళాలనే ద్యాస పుట్టింది. మెల్లగా గోదావరి గట్టు ఎక్కాను. కొద్దిగా ప్రొద్దు గ్రుంకుతున్నది. గట్టువారగా చింతచెట్లు, మరికొన్ని చెట్లు వుండేవి.     కొన్ని చెట్లపై బ్రహ్మజెముడుపక్షి  (గబ్బిలాలు లాంటివి) వున్నాయి. అవి సాయత్రము చెట్లపై ఎగురుతూ, వాలుతూ వుంటాయి. అవి చూసేసరికి కొంచెం భయం మనసులో మెదిలింది.
ఆ భయానికి తోడు ఇంటి దగ్గర ఆంటీ కొడుతుంది అనే భయంకూడా మొదలయ్యింది. అలా భయం, భయంగా నడుస్తున్నాను. ఇంతలో మా వూరి అతను ఒకరు సైకిలుపై వెళూ నన్ను చూసి, ఇక్కడ వున్నావు ఏంటి? నీకోసం ఊరంతా వెదకుతున్నారు అని, తన సైకిలిపై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.
ఆంటి ఈ వేళ నా తోలుతీస్తుంది అనుకుంటూ సైకిలుదిగుతుండగా నన్ను చూసి ఒకాసారిగా  పరుగెత్తుకునివచ్చి గట్టిగా పట్టుకుని ఏడ్వడం మొదలుపెట్టింది.  ఆ వెనకే నా చిన్నక్క వచ్చి తను ఏడ్వటం మొదలయ్యింది. కొడతారనుకున్న నేను ఒక్కసారిగా బిత్తరపోయాను.

ఇక ఇంటి దగ్గర  ఏమయ్యిందంటే :
మా వీధిలో కొందరితో కలిసి ఆంటీ పోలవరంలో వున్న, భానుథియేటర్లో సినిమాకు వెళ్ళడాన్కి  పథకం వేసుకున్నారు. నడిచివెళ్ళడం, సినిమా అయిన తర్వాత నడిచి రావడం కాబట్టి నన్ను తీసికెళ్తే నిద్రపోతే అవస్థ అవుతుందని నన్ను శాంతమ్మగారి ఇంటికి వెళ్ళి రమ్మన్నారు. నేను వెళ్ళి వచ్చేలోగా వాళ్ళు వెళ్ళిపోవాలని పథకం. అలాగే నేను వెళ్ళాక వాళ్లు వెళ్ళిపోయారు. ఇంటివద్ద వున్న చిన్నక్క నేను ఆంటీతో వెళ్ళాను అనుకుంది.
రాత్రి మొదటి ఆట చూసుకొని ఇంటికివచ్చేసరికి ఇంటివద్ద నేను లేకపోయేసరికి ఖంగారు పడ్డారు. వెదకడం మొదలు పెట్టారు. చుట్టు ప్రక్కల ఇళ్ళు, తర్వాత వీధులు. గ్రామాలు అప్పటికే నిద్రలో జోగుతుండేవి.
అప్పుడే ఒక విషయం తెలిసింది. అదేమంటే గోదారిలోవున్న గుడికి ఆ రోజు వుదయం సినీనటుడు ఎన్.టి. రామారావు వచ్చి వెళ్ళాడని. ఆయన్ని చూడడాన్కి   జనాలు ఎగబడ్డారని. అందరిలో ఒక భయం పొడసూపి పలు అనుమానాలు తలెత్తాయి. గోదావరిలో గాని నేను పడిపోయానేమో అనే అనుమానంతో  వెదకులాట గోదావరి తీరాలగుండా సాగింది.
అప్పట్లో మరోవదంతులు కూడా వుండేవి. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని. ఇలాంటి రద్దీ సమయాలలో వారి చేతివాటం చూపిస్తున్నారని.
చుట్టు ప్రక్కల మాకు బంధువులు వుండే, దొండపూడి, పోలవరం నేను ఆంటి తరచూ వెళ్ళే గృహాలన్నింటికి వెళ్ళి అక్కడికి గాని వెళ్ళానేమోనని వెదికారు.
లిల్లీ టీచరు గారి తమ్ముడి పెళ్ళివిషయం వారికి గుర్తుకు రాలేదు. ఇంతకుముందెప్పుడూ వారి ఇంటికి వెళ్ళలేదు కాబట్టి సందేహం కూడా రాలేదు.

3
1969 కొవ్వూరు, పశ్చిమగోదావరి జిల్లా.
నాన్న గారికి కొవ్వూరు బదిలీ అయిన తర్వాత స్కూలు సీట్ల సర్దుబాటు తర్వాత మొత్తం కుటుంబం, రైల్వే స్టేషను దగ్గర్లోని నాదెండ్లవారి వీధిలో అద్దెకు  వుండే వాళ్ళం.
పెద్ద అన్నయ్య రాజమండ్రి , ఆర్ట్స్ కాలేజీలో బి.ఎ. చదువుతుండేవాడు. కొవ్వూరునుండి రోజూ రైలులో వెళ్ళేవాడు.
పెద్దక్క సునీతి, చిన్న అన్న లింకన్ 8వ తరగతి, చిన్నక్క 7వ తరగతి హైస్కూలులో జాయిన్ అయ్యారు.  నన్ను దుంపల బడి అని ఒక స్కూలు 5వ తరగతి లో చేర్చారు (ఈ సంగటన జరిగిన తర్వాత నన్ను మళ్ళీ పట్టిసం పంపేసారు, అందువల్ల స్కూలు పేరు గుర్తులేదు)
కొవ్వూరుకు ప్రక్కనేవున్న   పశివేదలలో మావయ్య వుండేవారు.  ఆయన రైల్వేలో పనిచేసేవారు.
ఓ రోజు మధ్యాహ్నం మావయ్య మాయింటికి వచ్చారు. పెద్దక్క, చిన్న అన్నయ, చిన్న అక్క పశివేదల వస్తామని మావయ్యకు చెప్పారు. సాయంకాలం స్టేషనుకు వచ్చేయండి అక్కడనుండి కలిసివెళదాం అనిచెప్పి మావయ్య వెళ్ళిపొయాడు. అక్క వాళ్ళతో నేనూ వస్తానని చెప్పాను. సరే తయారయ్యివుండు,  బజారుకు వెళ్లి వస్తాము అని వెళ్ళిపోయారు. నేను సిద్దపడి ఎదురుచూడటం మొదలుపెట్టాను.  ఎంతసేపటికి రాకపోయేసరికి స్టేషనుకు వెళ్దామని బయలుదేరి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మేము  వెళ్దామనుకున్న పాసింజరు రైలు అప్పుడే వెళ్తూ కన్పించింది. ఆ రైలులో వెళ్ళిపోయివుంటారని అనుకున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయాయారు అని ఏడ్పువచ్చింది. రైలుపట్టాలవెంట నడిచివెళ్తే మూడు కిలోమీటర్లు వుండవచ్చు. ఇంతకుముందు ఒకసారి వెళ్ళిన గుర్తు. వెళ్దామని పట్టాలవెంట నడక మొదలుపెట్టాను. మద్యలో కొంగలబాడవ అనే వంతెన వుంది దానిపై దాటదానికి భయంవేసి ఆగిపోయాను. కొద్దిసేపటికి ఒకామె(బహుశ నర్సు అనుకుంట) డ్యూటీనుంచి వస్తూ, రైలు దాటిపోవడంవల్ల ఆమె నడిచి వెళ్తుంది. ఆమె నన్ను వంతెన దాటించింది.
పశివేదల స్టేషనులో దిగితే ప్రక్కనేవున్న రైల్వేక్రాసింగు  గేటు ముందుగా వెళ్తారు అందరు. అక్కడ బంధువు ఆయన కూడా (మావయ్య వరుస)  వుండేవారు. ఆయన గేటు ఆజమాయిషీతోపాటు, టిక్కెట్లను వసులు, తనిఖీ చేసేవాడు.
నేను రైలుపై రాలేదు కాబట్టి అడ్డదారిలో ఇంటికి వెళ్లిపోయాను.  అత్తయ్య గాని, మావయ్య గాని నా రాకను పెద్ద అనుమానంగా చూడలేదు. మిగతా పిల్లలు ఎందుకు రాలేదో రేపు అటువైపు వెళ్ళినప్పుడు కనుక్కుంటాలే అన్నాడు. అలాగే ఉదయమే ఆయన డ్యూటీకి, అత్తయ్య కూడా పనిలోకి వెళ్ళిపోయారు. నా వయసుదే అయిన వదిన కూడా బడికి వెళ్ళిపోయింది. నేను వచ్చినది  సాయంకాలం అవటంవల్ల రెండు రాత్రులు గడిచాయనుకుంట.
ఒక్కడ్నే గదిలో కూర్చొని ఆడుకుంటున్నాను. ఇంతలో పెద్ద అన్నయ్య, పెదనాన్నగారి అబ్బాయి ఇద్దరూ కలిసి వచ్చారు. ఒక్కసారిగా నన్నుచూసి ఆశ్చర్యపోయారు. వెంటనే నన్ను తీసుకొని కొవ్వూరు ఇంటికి వెళ్ళారు.


ఇక ఇంటి దగ్గర  ఏమయ్యిందంటే :
అక్కవాళ్ళు బయటికివెళ్ళి వచ్చేసరికి సమయం లేకపోవడంవల్ల ఆ రోజుకు ప్రయాణాన్ని వద్దు అనుకొని ఇంటికి వచ్చేసారు.  మొదట పిల్లలతో ఆడుకోవట్డానికి ఎటైనా వెళ్ళివుండవచ్చనుకున్నారు. చీకటైనా రాకపోయేసరికి ఆందోళన మొదలయ్యింది. అందులోనూ పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళు రకరకాల రూపంలోనూ, సాధువులుగానూ తిరుగుతున్నారనే రకరకాల పుకార్లు వుండేవి. అవి నిజమో కాదో నాకు అంతగా గుర్తులేదు.
మొదట మా చుట్టుప్రక్కల వీధుల్లో వెదికారు. కొవ్వూరులొనే లూథరన్ చర్చి దగ్గరలో  మా పెదనాన్నగారు వుండేవారు.  అక్కడికి గాని వెళ్ళానేమో అని చూసారు. అక్కడ కనబడలేదు. పశివేదల వెళ్ళేవిషయం తెలిసేసరికి వెళ్ళివుంటే గేటు దగ్గర వుండే మావయ్యకు కనబడతారు కదా అందుకని కొవ్వూరు స్టేషను నుంచి ఫోను చేయించి  అడిగితే నేను చూడలేదు అని, వస్తే కన్పడకుండా ఎలావెళ్తాడు అని  చెప్పారట. దానితో పశివేదల రాలేదని అనుకున్నారు.
పెద్దన్నయ్య, మోషే, లివింగష్టన్ (ఇద్దరూ పెదనాన్న గారి పిల్లలు) అన్నయ్యలు మిగతా స్నేహితులు కలిసి రాత్రంతా వీధి, వీధి వెదికారు.
గోదావరి ఒడ్డున గోపాదాల రేవు వద్ద కొన్ని గుడులున్నాయి. అక్కడ సాధువులు, బిచ్చగాళ్ళు రాత్రిళ్ళు పడుకునేవారు. ఒకొక్కరిని లేపి, ముసుగుతీసి మరీ వెదికారట.  ఎవరెవర్నె లేపారో, దుప్పటి లాగి చూసారో చాలా కాలం కథలు కథలుగా చెప్పుకునేవారు మా అన్నయ్య వాళ్ళ స్నేహితులు
మరసటిరోజు పోలీసు కంప్లయింటు ఇచ్చారట. కొవ్వూరు రైల్వేస్టేషను, రాజమండ్రిలోని గోదావరి, రాజమండ్రి స్టేషనులోనూ వెదికారట.
నిడవోలులో రైల్వేస్టేషనులో ఓ పిల్లాడు దొరికాడని బాగా ఏడుస్తున్నాడని తెలిసిందట. ఆ సమయంలో కొవ్వూరునుండి నిడదవోలుకు రైలు ఏవీ లేకపోవడం, మా అన్నయ్య వాళ్ళు పశివేదలవచ్చి కొంచెం ఏదైనా తిని, ఓ గంట తర్వాత వున్న రైలుకు వెళదాం అని పశివేదల వచ్చారు.
అలా వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోక ఏమి చేస్తారు.
***
ఇక్కడే కొవ్వూరులో వుంటే మళ్ళీ ఏమి చేస్తాడొనని మళ్ళీ నన్ను కటాక్షమ్మ ఆంటీ దగ్గరకు పాత పట్టిసం పంపేసారు.
- జాన్ హైడ్ కనుమూరి
john hyde

Saturday, October 19, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే - శ్రీ రావూరి భరద్వాజ

మనసు శరీరం రెండూ అంతగా అదుపులో లేవు. జ్ఞాపకాలు ఏవీ జ్ఞప్తికి రావటంలేదు. అయినా
టైపుచెయ్యాలని వేళ్ళు ఉబలాటపడుతున్నాయి.
పరుగెడుతున్నవయస్సులో వెనక్కు చూడటం కుదరుదు కదా! ఇప్పుడు నిలబడ్డవయస్సులో వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్నో మలుపులు, సంఘటనలు, తారసపడ్డ వ్యక్తులు, ప్రయాణాలు, మజిలీలు, ....ఇవన్నీలేకుంటే జీవితమెలా అవుతుంది?
నన్ను మలుపుతిప్పిన ఒకానొక వ్యక్తి కలిసినచోటుకు తిరిగి ప్రయానిద్దాం ఇప్పుడు.
నేను అనుపమ ప్రింటర్స్‌లో(1986-88మధ్య)   కంపోజిటరుగా పనిచేస్తున్న రోజులు.   కాంతమ్మ జ్ఞాపకాలతో డైరీ అనుకుంట కంపోజింగు చేస్తున్నాము. అక్కడ ఇద్దరం పనిచేసేవారం. నేను లైన్లు మాత్రం కంపోజింగు చెయ్యాలి, పేజీసెట్టింగు, ప్రింటింగు మిషనుకు అనువుగా కావలసినవన్ని వేరే అతను చూసుకొనేవాడు.  సాయత్రం ఒక పెద్దాయన వచ్చి మేము చేసినవాటి ప్రూఫ్‌లను చూసి తప్పు ఒప్పులను చూసి వెళ్ళేవారు. మొదట్లో పెద్ద ఆశక్తి ఏమీ అనిపించలేదు కానీ పోను పోనూ ఆయన మాటలకు చెవిపెట్టడం అలవాటయ్యింది. మొదట ఆయన గురించి తెలియదు, ఓ రోజు ఓపెన్ యూనివర్సిటీ గురించిన ప్రస్తావనలో, ఆయన రేడియోస్టేషనులోఉన్నప్పుడు విన్న వార్తకు స్పందిస్తూ, అప్పుడే పొందిన పారితోషికాన్ని మంత్రిగారికి పంపడం తదనంతర ప్రక్రియలవల్ల ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భావం గురించి చెప్పారు. ఆ మాటలు నన్ను అబ్బురపరచాయి. అప్పుడు నేనూ ఇందులో చదవొచ్చుకదా అనే ఉత్సాహం కలిగింది. కొంతకాలంగా వదిలేసిన విద్యను మల్లీ కొనసాగించడానికి వీలు కలిగింది. తర్వాతికాలంలో నా వృత్తిని మార్చుకోవడానికి ఆసరా అయ్యింది
ఆయనే శ్రీ రావూరి భరద్వాజ

ఎందువల్లనో ఆయన్ని మళ్ళీ కలవలేకపోయాను
కవిత్వం చదవడం, రాయడం మొదలుపెట్టాక 2003లో నా మొదటిపుస్తకం "హృదయాంజలి"  ఎదో సాహిత్యకార్యక్రమంలో కలిసినప్పుడు ఇవ్వడం జరిగింది. తరువాత ఓ రోజు ఫోనుచేసి అభినందించారు. అడపా దడపా  ఆయన్ని ఎదో కార్యక్రమంలో కలిసినా ఎందుకో నేనుగా ఆయన్ని కలవలేకపోయాను అనే బాధ కలుగుతుంది.
చాలాసార్లు కలవాలి  అనుకోవడం అది ఎదో కారణాలతో అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం ఎందుకో అర్థంకాని విషయం.  ఆ వెలితి అలానే ఉండిపోతుంది.  

ఆయన ఇప్పుడు తన కాంతమ్మను కలవడానికి వెళ్ళాడు.  తను నడిన దారివెంబడి కొన్ని విత్తనాలను చల్లిపోయాడు. మొలకలెత్తిన విత్తనం చెట్టై ఎవరోఒకరికి నీడనిస్తుంది 

Saturday, October 12, 2013

మూడు జ్ఞాపకాలు- మూడు సాహసాలు! - సారంగ సాహిత్య వారపత్రికలో

ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.
అలాంటి మూడు సంఘటనలు.
నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో  అని ఎప్పుడూ సందేహమే!
1
వయస్సు సరిగ్గా  గుర్తులేదు. బహుశ ఇంకా స్కూలుకు వెళ్ళటంలేదు. అప్పట్లో వయస్సు ఆరో సంవత్సరం వస్తేగాని బడిలో చేర్చుకునేవారు కాదు.
స్థలం మాత్రం పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా). మా రూతు ఆంటీ 12వ తరగతి చదువుతుండేది. మా యిల్లు ఉన్నతపాఠశాల ఎదురుగా వుండటంవల్ల ఆంటీ వాళ్ళ స్నేహితురాళ్ళు తరచూ వచ్చి మంచినీళ్ళు త్రాగి వెళ్ళేవారు. అలా వచ్చేవాళ్ళలో   పురుషోత్తపట్నానికి చెందినవారు వుండేవారు. పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా)  అంటే పోలవరం గోదావరికి ఆవలి ఒడ్డునవుంది. ఆ గ్రామంనుండి  ప్రతిరోజూ పడవపై వచ్చి,  వెళ్ళేవారు.

read more

సారంగ సాహిత్య వారపత్రికలో

Tuesday, October 8, 2013

కవి సమయాన్ని, దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఎమైనా చెబ్తే చదవాలనివుంది



*****

కొన్ని రోజులుగా అడపాదడపా ఇబ్బంది పెడ్తున్న దగ్గుతో పాటు నిన్న సాయత్రంనుండి శరీరంలో ఏదో తెలియని అలజడి. శ్వాస ఇబ్బందో, గాస్ ఎటూ పోక ఇబ్బందో శరీరం సన్నని వణుకుల మధ్య నా ప్రక్కటెముక, పిల్లలు ఉపచారాలు చేసారు. బాగా ఆలస్యమైన రాత్రి అయ్యాక ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. ఉదయం 5 గటలకు వినిపించే అజా పిలుపుతో తెలవారుతుందని మాగన్నుగా తెలుస్తుంది.

అప్పుడు మరో అలజడి మొదలయ్యింది. ఎవరో కవిత వినిపిస్తున్నట్టు, నాలోనే కవిత రూపుదిద్దుకుంటున్నట్టు. ఇలాంటి అనుభవం కొత్తేమీకాదు, కానీ ప్రతిసారీ నిద్రనుతోసి రెప్పలు తెరచాక ఒక్క వాక్యం గుర్తుండేది కాదు. ఇలాంటి అనుభవాన్ని అక్షరం అక్షరం రాయగలగటం ఇది రెండవసారి.
నిద్రమత్తుగానే లేచి సిస్టం ఆంచేసి నిద్రకళ్ళాతోనే టైపు చేసాను. చివరి వాక్యం పూర్తిచేస్తుండగా కరంటుపోయింది. ఉన్న యు.పి.యెస్. ఎక్కువసేపు వుండదు అదిపోయేటంతలో సేవ్ చేసి సిస్టం ఆఫ్ చేసి వెళ్ళి పడుకున్నాను.

నేను ఎప్పుడైనా చదివిన కవిత్వమా అని సందేహం.
అందుకే శీర్షిక  పెట్టలేదు.

***

నీవు
నడిచిన మార్గాలను
వదిలిన పాదముద్రలను వెదకుతుంటాను
నాలుగు రోడ్లకూడలిలో
ఒంటరిగా నిలబడి కనిపిస్తావు

నలుగురుచూస్తున్న కూడలికదా
నాల్గు పూలమాలల్తో నిన్ను నింపేస్తాను
అలసిన చేతులు, మనసును మడతబెట్టి
నా గదిలోకి ముడుచుకుంటాను
నిద్రనిండిన దేహానికి నే వెదకుతున్నదేమిటో గుర్తురాదు

మెలకువవచ్చిన వేళ
తెరతీసిన నాటకమేదో మొదలౌతుంది
కూడలిలో నిన్నొంటరిగా వొదిల్నసంగతి గుర్తుకే రాదు!

రోడ్డు విస్తరణకో
పాతబడ్డ శిలవనో తొలగించిన సంగతి తెలియనే తెలియదు.

--0--

(నిద్రలో ఎవరో వినిపించినవి యదాతదంగా మీకోసం) 02.10.2013 05:15 hours ISD


కొన్ని అభిప్రాయాలు 
Ajit Kumar ఆమె పూర్తి చంద్రముఖిగా మారినట్లు మీరు పూర్తి కవిగా మారుతున్నారు. నిరంతరం మీ మనస్సులో కవితలతోనిండిన పాదాలు నాట్యం చేస్తున్నట్లుగా అందుబాటులో ఉంటున్నాయి. శారీరక బలహీనత ఏర్పడినప్పుడు మానసికోద్రేకాలు ప్రకోపిస్తుంటాయి. మీ వ్యాధి నిర్ధారణ అయినట్లే ఉంది. పాపం . మీరు కవి అయ్యారు. దయచేసి రోజుకోసారి మాత్రమే రెండుమూడుకు మించి గేయాలతో గాయాలు చెయ్యకండి ప్లీజ్. ఇక గేయ భావాన్ని చూస్తుంటే మీకు ఎవరిమీదో అనుమానంగా ఉన్నట్లుంది. ఆమె ఎప్పుడో రోడ్డు ప్రక్కన కనిపించిన ఆమె మిమ్మల్నొదిలిపోయిందేమోననే సంశయం కనిపిస్తుంది. చివరికి మీరు ఆమెను మరచి వెళ్ళిపోయారు. మీకు గుర్తు వచ్చి చూడడానికి వెళ్ళేసరికి రోడ్డు ప్రక్కనున్న ఆ పాకా పీకివేయబడి రోడ్డు విస్తురణ జరిగింది. ఆమె ఇప్పుడు తన పాకా ఏ రోడ్డు ప్రక్కన వేసుకున్నదా అని వెదుకుతున్నారు. రాత్రుళ్ళు ప్రయత్నించితే ఫలితం ఉండొచ్చు. బెష్ట్ ఆఫ్ లక్. షరా- దొరకకపోతే నన్ను తిట్టుకోవద్దు.

Sriramoju Haragopal రోడ్డు విస్తరణకో, పాతబడ్డ శిలవనో తొలగించిన సంగతి తెలియనే తెలియదు.....తొలగించబడని కలలు మాక్కూడా రావాలి. మీ స్వప్నకవిత చాలా బాగుంది.
Mercy Suresh Jajjara ఒక ఆధ్యాత్మికత , తాత్వికత నిండిన కవిత . ఒక దృశ్యంలోకి నడిపించి చివరన ముగించిన పాదాలు రోడ్డు విస్తరణకో, పాతబడ్డ శిలవనో తొలగించిన సంగతి తెలియనే తెలియదు. అన్నప్పుడు ఎందుకో ఒకలాంటి బాధ కలిగింది .. ఒక గాఢమైన నిట్టూర్పు కూడా ...
Afsar Afsar జాన్, చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులోని క్లుప్తత నాకు నచ్చింది. భావం కూడా మీ మామూలు కవిత్వ ధోరణికి భిన్నంగా వుంది. ఈ పద్ధతిలో ఇదే శైలిలో మరిన్ని రాస్తే బాగుంటుంది.
Padmakar Daggumati కవిత గురించి కాకుండా అన్నారు గనక షేర్ చేసుకుంటాను సారు. గాంధీ జయంతి ప్రభావం ఈ కవితమీద వుంది. గమ్ముగా పడుకుని టీవీలో గాంధీ ఫొటోలు చూడ్డం, ఇంకా పాటలు ఆటోమేటిగ్గా విన్న ప్రభావం మీ సబ్కాన్షస్ లో పనిచేసి ఉండాలి. ఇవేవీ కాకున్న Date rememberance చాలు మైండ్ కి. శంకర్దాదా జిందాబాద్ కాన్సెప్ట్ కూడా ఇదేనని మనకి తెలుసు. నాకూ ఇలా కొన్నిసార్లు వేకువలో జరిగింది. మీ సామాజిక చింతనకి, గాంధీయిజం అనాదరణ పట్ల మీఫీలింగ్స్(may be concious or subconcious) అక్షరాలుగా రూపొంది ఉండొచ్చు. బాగా జ్ఞాపకం పెట్టుకుని రాశారు. థాంక్యూ.
  
 

Tuesday, September 10, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే - 3


గురువుల జ్ఞాపకాలను సీరియల్‌గా రాయలని అనుకోలేదు. అయినా యాదృశ్చికంగా గుర్తుకొచ్చేవి ఇలా  రికార్డు చేస్తున్నానంతే.  ఇందులో ఒక  గురువు మరియు వినాయక చవితి వుండటం విశేషం 

కొంతకాలం మధ్యప్రదేశ్‌లో పనిచేసివచ్చాక 1985లో  ఇంటివద్దే వుండిపోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు ఒక మిత్రునిద్వారా ఒకవిషయంతెలిసింది. అదేమంటే ఎక్కడైనా వర్కుషాపులో  పనిచేసినట్టు సర్టిఫికేట్టు వుంటే ఐ.టి.ఐ. పరీక్ష రాయవొచ్చని. అందుకోసం జేవియర్స్ ఐ.టి.ఐ. వర్కు షాపులో బీరువాలు తయారీలో నానీ అనే ఒకాయ వుండేవారు ఆయన దగ్గర పనికి చేరాను. నాతోపాటు మరో ఇద్దరు ఆయన చేతిక్రింద పనిచేసేవారు. అప్పటివరకు ఆఫీసు పనులు చేసిన నేను ఆ పని కష్టమనిపించేది. బీరువా కోసం షీట్ ను  ముందుగా తగిన కొలతలతో చుక్కలు పెట్టుకొని వాటి ప్రకారం వులితో కట్ చెయ్యడం, అవసరమైన వంపులు కొన్ని మిషను సహాయంతో మరికొన్ని సుత్తిని వుపయోగిస్తూ చాకచక్యంగా వంచడం కత్తిమీద సాములా అనిపించేది. మొదటి వారంలో సుత్తెదెబ్బవేయడంలో మెళకువలు తెలియక  వేళ్ళు నలగ్గొట్టుకున్న సందర్భాలు వున్నాయి. షీట్‌ను డిజైన్ చెయ్యడం అనేది అన్నిటిలో కీలకమైన పని. దాన్ని సులువుగా నేర్చుకున్నానని ఆయన నా స్నేహితులతో అనడం తటస్థించింది. డ్రిల్లింగు, రివిటింగు, షీట్‌లో చొట్టలను కనిపెట్టి సరిచెయ్యడం, విదివిడిగా బెండింగు చేసుకున్న వాటిని ఒక్కచోట చేర్చి రివిటింగు చేసి, తలుపులు అమర్చడం, తలుపులకు, లోపలి అరలకు తాళాలు తయారు చేసుకుని బిగించడం. చివరిగా కొలతలను చూసుకొని   టింకరింగు   ఛేయించడం.  

తర్వాతి సంగతి పెయింటరు చూసుకునేవాడు. చలా కాలం పెయింటింగు సెక్షనుకు నేను వెళ్ళలేదు. ఒకరోజు వెళితో అంతకుముందు రోజు మేము పూర్తిచేసిన బీరువాకు గ్రీన్‌మెటాలిక్ రంగు వేస్తున్నారు. వావ్... మేమేనా చేసింది ఈ బీరువాను అనిపించింది.
 
నేను రాయలనున్న ఐ.టి.ఐ. పరీష కాస్థ అప్పటికే 25 దాటిన వయస్సువల్ల అవకాశం పోయింది. దానితో అక్కడ పనిచేయడంలో ఉత్సాహం ఎక్కువరోజులు మిగలలేదు.

ఈ సోదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ సంవత్సరం నానీ మేస్త్రీ (ఆయన్ని అలానే పిలిచేవారు, ఆయన అసలుపేరు తెలియదు) వినకచవితి పూజను మొత్తం నాచేత చేయించారు. అంతకుముందే కొన్ని సందర్భాలలో నేను పంచె, లాల్చీ ధరించేవాణ్ణి. అది తెలిసిన ఆయన నా చేత పంచె కట్టించి, తను కూడా పంచె కట్టుకుని పూజా విధానం పుస్తకం తెప్పించి ఆరోజు పూజను నాచేత చేయించారు. పూజ తర్వాత లేవబోతుంటే వాళ్ళ ఆవిడ ప్రక్కన ఇళ్ళలోని వారిని పిలిచి కూర్చోబెట్టి కథను చదవమన్నారు. పంచే కూర్చుంటానికి అనుకూలమైనా, ఆ వయసులో అంతసేపు కూర్చోవడం గొప్ప విషయమే.  ఎలాగో కథ పూర్తి చేసాను. నేను అంతకుముందు తెలియని కొందరు ఆడవాళ్ళు కుర్రపంతులు గారు కథ బాగా చదువుతున్నారు, మాయింటిలోనూ కథ చెప్పించుకుంటాము వస్తాడంటారా! ఎంత తీసుకుంటారు అని అడగటం నా చెవిన పడనే పడింది. :) 
 
అప్పటికి గురువు (నానీ మేస్త్రీ) ఏదో తాంబూల ఇచ్చారు అది గుర్తు లేదు కానీ, చాలా కాలం తర్వాత చవితి నాటి కథను బాగ వినిపించావయ్యా! అని మెచ్చుకోవడం గుర్తుంది.
 
అప్పుడు పూజను మనస్సుపూర్తిగా చేసానో, పైపైనే చేసానో గానీ, వినాయకచవితి పూజలో కూర్చోవడం అదే తొలి మరియు తుది. 

తర్వాతి కాలంలో హైదరాబాదు వచ్చేయడంతో  మళ్ళీ ఆయన్ను కలవలేదు. కలవాలనే ప్రయత్నంచేసినప్పుడు ఆయన ఇక లేరు అనే విషయం తెలిసింది.  

 

Sunday, September 8, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే - 2

1975-77 లో నేను చదివిన జూనియర్ కాలేజి, ఏలూరు నా స్నేహితుడు/నాజూనియర్ 
Chunduri Srinivasa Gupta   
ఇన్ని సంవత్సరాలైనా మారని గేటు ఓ తియ్యని జ్ఞాపకం

ఇంటర్మీడియెట్  కోసం గర్నమెంటు జూనియర్ కాలేజి, ఏలూరులో 1975-77 బాచ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు మాకు శ్రీ జనార్దన రావు,  ప్రిన్సిపాల్‌గా వుండేవారు. కొంచెం పొట్టిగాను, పరమ కఠినంగానూ ఉండేవారు. ఆయనకు ఇంగ్లీషు పొయెట్రీ అంటే పరమ పిచ్చి. అందుకే అన్నీ గ్రూపులను (ఎం.పి.సి., బై.పిసి., సి.యిసి., ఎం.ఇ.సి., హెచ్.ఇ.సి.) ఒక్కచోట ఆరుబయట మైదానంలో కూర్చోబెట్టి, మైకు పెట్టి పొయెట్రీ పాటాలు చెప్పేవారు. ఈయన నాన్నకు స్నేహితులు అవ్వడంవల్లనే ఇక్కడ నన్ను చేర్పించారని రెండు సంవత్సరాలు పూర్తయ్యాక తెలిసింది. మా కాలేజి ప్రక్కనే రెవెన్యూ ఆఫీసుల సమూహం ( తాలూకాఫీసు, ట్రజరీ, తాలూకా కోర్టు ఇంకా కొన్ని.) వుండేవి.  ఇద్దరు ఎప్పుడైనా కల్సే సందర్భం ఏర్పడినప్పుడు ఇంగ్లీషు సాహిత్యం గురించే మాట్లాడుకునేవారంట. 

నాకు తెలియకుండానే నన్ను కవిత్వంవైపు నడిపించారని ఇన్నేళ్ళ తర్వాత ఇలా గుర్తుచేసుకోవడంలో బయటపడింది.
ఆయన చెప్పిన పాఠాల్లో నాకు గుర్తున్నవి మూడు
1. బ్రూక్ -
THE BROOK
by: Alfred Tennyson (1809-1892)
COME from haunts of coot and hern,
I make a sudden sally,
And sparkle out among the fern,
To bicker down a valley.
 
By thirty hills I hurry down,
Or slip between the ridges,
By twenty thorps, a little town,
And half a hundred bridges.
 
Till last by Philip's farm I flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on forever.
 
I chatter over stony ways,
In little sharps and trebles,
I bubble into eddying bays,
I babble on the pebbles.
 
With many a curve my banks I fret
by many a field and fallow,
And many a fairy foreland set
With willow-weed and mallow.
 
I chatter, chatter, as I flow
To join the brimming river,
For men may comeand men may go,
But I go on forever.
 
I wind about, and in and out,
with here a blossom sailing,
And here and there a lusty trout,
And here and there a grayling,
 
And here and there a foamy flake
Upon me, as I travel
With many a silver water-break
Above the golden gravel,
 
And draw them all along, and flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on forever.
 
I steal by lawns and grassy plots,
I slide by hazel covers;
I move the sweet forget-me-nots
That grow for happy lovers.
 
I slip, I slide, I gloom, I glance,
Among my skimming swallows;
I make the netted sunbeam dance
Against my sandy shallows.
 
I murmur under moon and stars
In brambly wildernesses;
I linger by my shingly bars;
I loiter round my cresses;
 
And out again I curve and flow
To join the brimming river,
For men may come and men may go,
But I go on forever
ఈ పాఠం గుర్తు రాగానే గోదావరి నది మాత్రమే గుర్తుకొస్తుంది. ఈ పాఠం విన్నరోజుల్లోనే కోస్తా /కోనసీమ ఏరియాలో ఒకపెళ్ళికి వెళ్ళాడం, ఒక గ్రామంనుండి అమలాపురంవరకు కొంతమంది పడవలో వెళ్ళాము.  ఆనుభవమే గుర్తుకొస్తుంది. తర్వాతి రోజుల్లో గోదావరి, మరికొన్ని నదుల పుట్టుక ప్రదేశాలను సందర్శించినప్పుడు నాకు ఈ బ్రూక్ పాఠం, జనార్దన్ రావు గారు చెబుతున్న స్వరం వినబడుతుంది.


2. సోలిటరీ రీపర్ -
The Solitary Reaper -William Wordsworth

Behold her, single in the field,
Yon solitary Highland Lass!
Reaping and singing by herself;
Stop here, or gently pass!
Alone she cuts and binds the grain,
And sings a melancholy strain;
O listen! for the Vale profound
Is overflowing with the sound.

No Nightingale did ever chaunt
More welcome notes to weary bands
Of travellers in some shady haunt,
Among Arabian sands:
A voice so thrilling ne'er was heard
In spring-time from the Cuckoo-bird,
Breaking the silence of the seas
Among the farthest Hebrides.

Will no one tell me what she sings?--
Perhaps the plaintive numbers flow
For old, unhappy, far-off things,
And battles long ago:
Or is it some more humble lay,
Familiar matter of to-day?
Some natural sorrow, loss, or pain,
That has been, and may be again?

Whate'er the theme, the Maiden sang
As if her song could have no ending;
I saw her singing at her work,
And o'er the sickle bending;--
I listened, motionless and still;
And, as I mounted up the hill,
The music in my heart I bore,
Long after it was heard no more.


 ఈ పాఠం చెబుతున్నప్పుడు ప్రకృతిని గురించి, పని పాటలు సంస్కృతిలో భాగం. జానపథాన్ని వివరిస్తూ, బహుశ ఆమె "ఎన్నియెల్లో, ఎన్నియ్యాల్లో హుయ్ ..."   అని పాడిందేమోనని అప్పటికి కొద్దిరోజులముందే విడుదలయ్యిన భక్తకన్నప్ప సినిమాలోని పాట :
సాహిత్యం: ఆరుద్ర , గానం: రామకృష్ణ, పి.సుశీల

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)

అరె సిన్నోడా ..
ఆకుచాటున పిందె ఉందీ .. చెట్టూ సాటున సిన్నాదుందీ
ఓ ఓ ఓ ఆకుచాటున పిందె ఉంది .. చెట్టూ సాటున సిన్నాదుందీ
సక్కని సుక్కని టక్కున ఎతికీ దక్కించుకోరా .. దక్కించుకోరా

దక్కించుకోరా .. దక్కించుకోరా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అరె సిన్నమ్మీ ..
మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఓ ఓ ఓ మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా

మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
అరెరెరెరె ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా

ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా
ఓ ఓ ఓ సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా

కొప్పూ లోనీ మొగలీ పువ్వూ గుప్పుమందే .. ఒప్పులకుప్పా
ఓయ్ గుప్పుమందే .. ఒప్పులకుప్పా !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా

సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని
ఓ ఓ ఓ సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని

దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా నీకు నేనే .. నాకు నువ్వే
నీకు నేనే .. నాకు నువ్వే !

ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)
...............................................................పాటను డాన్సు చేస్తూ మరీ చెప్పారు.
పాఠంలోని పదాలు, పాదాలు అలాగే గుర్తులేదుగాని ఆయన చెప్పిన తీరు మాత్రం బాగా గుర్తుండిపోయింది.

3. అ సీన్ ఫ్రం   జూలియెస్ సీజర్
అంథోనీ స్పీచ్‌లోని ద్వైదీభావాన్ని,  దానిలోని హావ భావాలను నటించి, అభినయించిన వివరించిన తీరు ఇంకా కళ్ళముందు మెదులుతూనేవుంది   నారికేళ పాకమని చెప్పబడే షేక్‌స్పియర్‌ను   చదవడం సులువనిపించింది.  అప్పుడు చదవలేకపోయినా  గానీ తర్వాతి కాలంలో చదవడానికి గురువుగారు ఉపకరించారు అని చెప్పాలి.

*** గురువుగారు జనార్దన రావు గారు ఎక్కడవున్నా వారికి శిరసువంచి నమస్కరిస్తున్నాను.

Friday, September 6, 2013

గురువులను తలచుకోవడం భాగ్యమే


గతంలో నా బాల్య విద్యాభ్యాసాల గురువుల్ని జ్ఞాపకంచేసుకున్నాను. తరచూ మారుతున్న ఊర్లవల్లనో లేక నా జ్ఞాపకశక్తి లోపమో గాని లేక నా అనాసక్తో తెలియదు గాని చాలామంది పేర్లు గుర్తులేవు.

9వ తరగతినుంచి ఇంటర్మీడియెట్ వరకు  మా నాన్నగారంటే భయపడి తప్పించుకునేవాణ్ణి. ఆయన పనిచేసేది రెవెన్యూ డిపార్టుమెంటు అయినా మేము చదువుకునే సమయానికి ఆయనకు సమయం కుదిరితే షేక్సిపియర్ గురించో, బెర్నడ్ షా గురించో చెబుతుండేవారు. అలాంటి సమయంలో నేను లెక్కల పుస్తకాల్లోకి దూరేవాణ్ణి. ఆయనకు లెక్కలంటే భయం అదీ సంగతి.   అయితే ఇప్పుడర్థమవ్వుతుంది నాకు పరోక్షంగా కవిత్వంపై మక్కువ నాన్న కల్పించారని.

గురువులను తలచుకున్నప్పుడు 9, 10వతరగతులలో ప్రభావితంచేసిన ముగ్గుర్ని ముఖ్యంగా గుర్తు  చేసుకోవాలి.
శ్రీ సైమన్ - తెలుగు
శ్రీ ఆండ్రూస్ - ఇంగ్లీషు
శ్రీ జార్జి - లెక్కలు ... మాష్టార్లు. (జేవియర్స్ హైస్కూలు, ఏలూరు) వారు నేర్పినవే నాల్గక్షరాలు నాల్కలపై ఇంకా నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
అదేమి చిత్రమోగాని 10వ తరగతిలో  తెలుగుమాష్టారు ఎప్పుడూ కోపంగావుండేవారు.  పాఠాలుకూడా చాలా సీరియెస్‌గా   చెప్పడంవల్ల తెలుగంటే భయపట్టుకుంది. ఆ భయం కాస్తా ఇంటర్మీడియేట్‌లో హిందీ చదివేటట్టుచేసింది. హిందీ చెప్పిన మేడం పేరు  గుర్తులేకపోవడమే నాకు ఎప్పటికీ అర్థంకాని విషయం.  కానీ ఇన్నేళ్ళతర్వాత కూడా ఆమె చెప్పిన హిందీ సాహిత్యం గుర్తుకొస్తుంది. అలా పరోక్షంగా ఇప్పటి నా సాహిత్యాభిరుచికి ఆమె పునాదివేసింది అనిపిస్తుందిప్పుడు.

ఆమె పేరు శ్రీమతి వరలక్ష్మి (అప్పటికి ఇంకా శ్రీమతి కాలేదని గుర్తు) అని ఇప్పుడే ఆన్‌లైన్లోకివచ్చిన మిత్రుడు చెప్పాడు.
దోహేలు గుర్తుచేసుకున్నప్పుడు  ఇప్పుడే  తరగతి గదిలో  వున్నట్టే అనిపిస్తుంది నాకు.
నవల ఒకటి నాండిటేల్ వుండేది  నవలపేరు గుర్తులేదు కాని నవలలోని ముఖ్యఘట్టాలు ఇంకా గుర్తున్నాయి. 
హిందీ క్లాసుకు కొసమెరుపు ఏమిటంటే వరలక్ష్మి గారు అందంగా వుండటమే కాకుండా మధురంగా పాఠం చెప్పడం, అన్ని గ్రూపులలో వున్న విద్యార్ధిని , విద్యార్థులు ఒక్కచోటకు చేరటం. అంతే కాక మగపిల్లకంటే, అమ్మయిలే ఎక్కువగా వుండటంవల్ల క్లాసు అందంగాను, రంగురంగులగాను వుండటంవల్ల ఒక్క క్లాసుకూడా మిస్సు కాలేదని గుర్తు.  
తర్వాత కాలంలో డిగ్రీలో పెద్దగా ప్రభావితంచేసినవాళ్ళు లేకపోవడంవల్ల ఎవ్వరూ గుర్తు  లేరు.
* * *

కవిత్వాన్ని ఆశ్రయంగా పొందాక మొదటి గురువు శ్రీ సి.వి. కృష్ణారావు  గారు.

మొదట పరిచయం అయినప్పుడు "నెలనెలా వెన్నెలకు" వస్తూవస్తూ ఓ రెండు కవితలు పట్టుకు రావడం మరిచిపోకండి అని పోనుచేసి చెప్పేవారు. నెలంతా రెండు కవితలు రాయాలి అనే అలోచన మనసులో కదులుతూ వుండటంవల్ల కొన్ని సార్లు నెలంతటిలో ఒక్కటీ రాయలేకపోవడం, ఒక్కోసారి ఒకటికంటే ఎక్కువ రాయడం  అనుభవం.  బహుశ ఈయన ప్రభావంవలననే కవిత్వం నిత్యకృత్యమైయ్యింది.  
ఆయన నన్ను అడిగే రెండు ప్రశ్నలు ఎప్పుడూ స్ఫూర్తిగానేవుంటాయి.  కొత్తవేమిరాసారు అని మొదటిది. కొత్త పుస్తకాలు ఎమి సంపాదించారు అని రెండవది.
ఆయనతో గడిపిన సమయమంతా ప్రపంచ సాహిత్యాన్ని చుట్టివచ్చినట్టే వుండెది. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్పిస్తుంది


***


కవిత్వాన్ని రాయడం ప్రారంభించాక కొందరి కవిత్వం నన్ను ఆకర్షించింది. వారిని గురువులుగానే స్వీకరిస్తాను
శివారెడ్డి - ఈయన కవిత్వాన్ని  చదివినప్పుడు, ఆయనతో సమయం గడిపినప్పుడు ఏమనిపించిందో గమనించలేదు గానీ గుండె ఆపరేషను అయ్యి పడకమీదవున్నప్పుడు ఆయన కవిత్వాన్ని వల్లెవేయడం నాకు నాకే ఆశ్చర్యమనిపించిన విషయం.

జ్వాలాముఖి - అనర్గళమైన ఆయన ప్రసంగాలు వింటున్నప్పుడు దాని వెనుకవున్న ఆయన కృషి, సాధన కన్పించాయి. ఆయనలా అనర్గళంగా మాట్లాడంటే చేయాల్సిన కృషి ఎప్పుడూ గుర్తుకువచ్చేది.



కె. శివారెడ్డి, కె.యెస్. రమణ, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి, నాళేశ్వరం శంకరం,   వాడ్రేవు చినవీరభద్రుడు,    వీరి కవిత్వం చదివినప్పుడు నేనూ వీరిలా రాయగలగాలి అని స్ఫూర్తినిచ్చారు. వీరి కవిత్వాన్ని స్పూర్తిపొంది రాసిన కవితా సందర్భాలున్నాయి.

***

ఈ మధ్య ఎం.ఎ. తెలుగు దూరవిద్యలో చదవడం మొదలుపెట్టాను
అక్కడ బయట పరిచయముండీ  . శ్రీ కె.యస్. రమణ,   శ్రీ సుధామ, ప్రత్యక్ష గురువులైనవారు
శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీ తిరునగరి శ్రీనివాస్, శ్రీమతి రజని, శ్రీ పాల్ రత్నాకర్ గార్లు కొత్తగా గురువులయ్యారు.

ఇక్కడ సహ విద్యార్దులుకూడా  శ్రీమతి అరుణ, శ్రీమతి పద్మ, శ్రీమతి ఉష ఉపాద్యాయులుండటం గమనార్హం.


గురువులను గుర్తు చేసుకోవడం కొత్త వుత్తేజాన్ని ఇచ్చింది.
***

అక్క శ్రీమతి మేరీ సలోమి ఉపాద్యాయినిగా వుండటం అభినందనీయం